Massacre: గాఢ నిద్రే.. ప్రాణభిక్ష! థాయిలాండ్ ఘటనలో క్షేమంగా బయటపడ్డ ఏకైక చిన్నారి
థాయిలాండ్లోని ఓ ‘డే కేర్’ సెంటర్లో ఇటీవల ఓ ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల ఘటనలో ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడంది. కారణం.. ఆ సమయంలో ఆమె దుప్పటి కప్పుకొని నిద్రపోతుండటమేనట.
బ్యాంకాక్: థాయిలాండ్లోని ఓ ‘డే కేర్’ సెంటర్లో ఇటీవల ఓ ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 24 మంది చిన్నారులతోపాటు 30 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ మారణకాండ(Thailand Massacre)లో అక్కడే ఉన్న ఓ చిన్నారి మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడటం విశేషం. కారణం.. ఆ సమయంలో ఆమె తరగతి గది మూలలో దుప్పటి కప్పుకొని నిద్రపోతుండటమే. ఆమే మూడేళ్ల ‘పవీనట్ సుపొల్వాంగ్’. ఘటనా సమయంలో ఆమె గాఢంగా నిద్రపోతోందని, అప్పటికే ఆమెపై దుప్పటి కప్పి ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇదే ఆమె ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది! ఈ దారుణం నుంచి క్షేమంగా తప్పించుకున్న ఏకైక చిన్నారి సుపొల్వాంగ్ కావడం గమనార్హం.
‘నేను షాక్లో ఉన్నా!’ అని పాప తల్లి పనోమ్పాయ్ సితోంగ్ ఓ వార్తాసంస్థతో చెప్పారు. తన బిడ్డ బతికి ఉన్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఇతర పిల్లల కుటుంబాలను చూస్తే బాధేస్తోందన్నారు. ఇది విచారం, కృతజ్ఞత కలగలిపిన కొత్త అనుభూతి అని వివరించారు. అయితే, ఈ విషాదం గురించి చిన్నారికి జ్ఞాపకం లేకపోవచ్చని తెలిపారు. ఘటనాస్థలం నుంచి నిందితుడు వెళ్లిపోయిన తర్వాత.. గదిలోని ఒక మూలలో కదలికల ఆధారంగా పాప బతికున్నట్లు గుర్తించారు. తోటి పిల్లల మృతదేహాలు కనిపించనీయకుండా.. అలాగే దుప్పటితో ఆమె ముఖాన్ని కప్పి తీసుకొచ్చారని సితోంగ్ తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన చిన్నారుల్లో.. 11 మంది ఆమె నిద్రిస్తున్న గదిలోనే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
అయితే, తన కుమార్తెను ఆత్మలే రక్షించాయని తల్లి పేర్కొనడం గమనార్హం. ‘సాధారణంగా చిన్నపాటి అలికిడి అయినా ఆమె నిద్రలేస్తుంది. కానీ, ఆ రోజుమాత్రం గాఢ నిద్రలో ఉంది. ఆ సమయంలో ఆమె కళ్లు, చెవులను ఆత్మలు మూసేసినట్లు నమ్ముతున్నా. అందరికీ వేర్వేరు నమ్మకాలు ఉంటాయి. నా విషయంలో మాత్రం ఇదే’ అని వివరించారు. ఈ ఘటనలో చిన్నారి బెస్ట్ ఫ్రెండ్, రెండేళ్ల టెకిన్ మృతి చెందిందని.. ఈ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పామన్నారు. ఈ ఘటన గురించి ఆమెకు పూర్తిగా తెలియదన్నారు. మరో బంధువు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పాప ప్రాణాలతో బయటపడటాన్ని ఓ ‘అద్భుతం’గా అభివర్ణించారు. ఇదిలా ఉండగా.. ఈ దురాగతానికి తెగబడిన హంతకుడు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM