Biden: జీ20పై జిన్పింగ్ నిర్ణయం నిరాశపర్చింది: బైడెన్
జీ20 సదస్సుకు హాజరు కాకూడదని జిన్పింగ్ నిర్ణయించుకొన్నట్లు వస్తున్న వార్తలపై జోబైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. అయినా.. తాను చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యేందుకు వెళుతున్నట్లు చెప్పారు.
ఇంటర్నెట్డెస్క్: జీ20కి హాజరుకాకూడదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ (Xi Jinping) తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) నిరాశ వ్యక్తం చేశారు. ఈ వారంలో జరగనున్న సదస్సుకు తన ప్రతినిధిగా చైనా ప్రీమియర్ లి కియాంగ్ను పంపాలని జిన్పింగ్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై తాజాగా డేలావేర్లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ.. ‘‘నేను నిరుత్సాహనికి గురయ్యాను.. కానీ, నేను ఆయనను కలిసేందుకు వెళుతున్నాను’’ అని ముక్తసరిగా పేర్కొన్నారు. కానీ, వీరి సమావేశం ఎక్కడ జరుగుతుందనే సమాచారం మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 7-10 మధ్యలో బైడెన్ జీ20 సదస్సు పర్యటన జరుగుతుంది. అనంతరం వియత్నాంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలపై బైడెన్ స్పందిస్తూ.. ఆయా దేశాలతో మరింత సమన్వయం చేసుకోవాల్సి ఉందన్నారు. అదే సమయంలో భారత్, వియత్నాం కూడా అమెరికాతో సంబంధాలను బలపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు.
వాస్తవానికి గతంలో తాను భారత్ వెళతానని జిన్పింగ్ వెల్లడించారు. కానీ, గురువారం చైనా విదేశాంగ శాఖ నిర్వహించిన సాధారణ ప్రెస్మీట్లో ఈ పర్యటనపై విలేకర్లు ప్రశ్నించగా.. కచ్చితంగా అధికారులు చెప్పలేకపోయారు. అదే సమయంలో జిన్పింగ్ ఈ ఏడాది జీ20కి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.
భారత్-చైనా సంబంధాలు బాగా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న సమయంలో జిన్పింగ్ గైర్హాజరు.. పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. గత వారం చైనా సరికొత్త మ్యాప్ను జారీ చేయడం ఇరు దేశాల మధ్య మరో వివాదాన్ని రాజేసింది.
బైడెన్-జిన్పింగ్ గతేడాది బాలిలో జరిగిన సదస్సులో భేటీ అయ్యారు. వీరు ఈ ఏడాది నవంబర్లో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఆ నెలలో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోపరేషన్ సదస్సు నిర్వహించనున్నారు. ఈ భేటీకి జిన్పింగ్ హాజరయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ