ఎలిజబెత్-2కు శాశ్వత స్మారకం
గతేడాది సెప్టెంబరు 8న మరణించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు శాశ్వత స్మారకాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నిర్మాణానికి బ్రిటన్ ప్రభుత్వ సన్నాహాలు
2026లో ప్రణాళిక ఆవిష్కరణ
లండన్: గతేడాది సెప్టెంబరు 8న మరణించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు శాశ్వత స్మారకాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమె తొలి వర్ధంతి సమీపిస్తున్న నేపథ్యంలో.. బ్రిటన్ ప్రభుత్వం ఆదివారం దీనిపై ప్రకటన చేసింది. స్మారకానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఓ స్వతంత్ర కమిటీని నియమించింది. ఎలిజబెత్-2 మాజీ వ్యక్తిగత కార్యదర్శి లార్డ్ రాబిన్ జన్వ్రిన్ దీనికి అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిటీలో మరికొందరు నిపుణులు, ప్రముఖులను నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వారు స్మారక నిర్మాణంపై ప్రతిపాదనలను ప్రభుత్వంతో పాటు ప్రస్తుత రాజు ఛార్లెస్-3కి అందిస్తాయని తెలిపాయి. ఎలిజబెత్-2 శత జయంతి సంవత్సరమైన 2026లో స్మారకానికి సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించాయి. 70ఏళ్ల పాటు రాణి హోదాలో ఎలిజబెత్-2 చేసిన ప్రజా సేవను ప్రతిబింబించేలా స్మారకం ఉండబోతోంది. దీని నిర్మాణానికి బ్రిటన్ ప్రభుత్వం నిధులు అందించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరిహద్దుల్లో దక్షిణ కొరియా కాల్పులు
ఉత్తర కొరియా దళాలు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు సరిహద్దు ఉత్తర భాగంలో తమ భూభాగంలోకి ప్రవేశించడంతో హెచ్చరిక కాల్పులు జరిపినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మంగళవారం తెలిపింది. -
బైడెన్ కుమారుడు దోషే
తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దోషిగా తేలారు. -
భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలు
భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలను నెలకొల్పనున్నామని ప్రముఖ జైన ఆధ్యాత్మిక నాయకుడు ఆచార్య లోకేశ్ ముని తెలిపారు. -
గాయపడిన విమాన ప్రయాణికులకు నష్టపరిహారం
గత నెలలో లండన్ నుంచి సింగపూర్ వస్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం గాలిలో పెద్ద కుదుపునకు లోనవడంతో అందులోని 211 మంది ప్రయాణికులలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. -
స్పీడ్ బోట్లో తైవాన్ చేరిన చైనా మాజీ నేవీ అధికారి
చైనా మాజీ నేవీ అధికారి ఒకరు ఆ దేశం నుంచి పారిపోయి తైవాన్ చేరుకున్నారు. -
మా విద్యుత్ రంగానికి సహకరించండి
తమ దేశంలోని విద్యుత్ నెట్వర్క్ మరమ్మతుల కోసం స్వల్పకాల సహకారం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. -
మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ దుర్మరణం
ఆఫ్రికా దేశమైన మలావీలో సైనిక విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. పర్వత ప్రాంతాల్లో సైనిక విమానం కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం ప్రకటించారు. -
కాల్పుల విరమణ ప్రణాళికకు భద్రతా మండలి ఆమోదం
ఇజ్రాయెల్, హమాస్ మధ్య 8 నెలలుగా జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఉద్దేశంతో తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి సోమవారం ఆమోదం తెలిపింది. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు భారతీయుల మృతి
రష్యా సైన్యం నియమించుకున్న ఇద్దరు భారతీయులు ఇటీవల ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంగళవారం ప్రకటించింది. -
యెమెన్ తీరంలో పడవ మునక.. 49 మంది మృతి
యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగిపోయిన ప్రమాదంలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140 మంది గల్లంతయ్యారు. -
తోటివారంతా ఆడి పాడుతుంటే.. తదేకంగా నిలబడిపోయిన బైడెన్!
వైట్హౌస్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఆడుతూ పాడుతుండగా.. అధ్యక్షుడు బైడెన్ మాత్రం కొన్ని సెకన్ల పాటు తదేకంగా నిలబడటం మరోసారి చర్చనీయాంశమైంది.