Kate Middleton: సర్జరీ అనంతరం యువరాణి కేట్‌ తొలిపోస్టు.. వదంతులకు చెక్‌

వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) సర్జరీ అనంతరం తొలిసారి స్పందించారు. ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

Published : 11 Mar 2024 00:08 IST

లండన్‌: వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స అనంతరం తొలిసారి ఆమె ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన ముగ్గురు పిల్లలతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

కేట్‌ మిడిల్టన్‌ కొలుకున్న అనంతరం భర్త ప్రిన్స్‌ విలియం ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని రోజులుగా ఆమె కనిపించడం లేదని సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులకు చెక్‌ పెట్టినట్లైంది. కొన్ని రోజుల క్రితం యువరాణి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం జనవరిలో వెల్లడించింది.

నెతన్యాహు తీరు ఇజ్రాయెల్‌నే గాయపరుస్తోంది: బైడెన్‌

అనారోగ్యం నుంచి కోలుకుంటున్న క్రమంలోనే ఆమె కోమాలోకి వెళ్లి ఉండొచ్చంటూ సోషల్‌మీడియాలో వదంతులు వ్యాపించాయి. ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడమే దీనికి కారణమైంది. ఈ ఆరోపణలను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాలు తోసిపుచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని