PhonePe: నెంబర్ప్లేట్ స్థానంలో ఫోన్పే.. దీని సంగతేంటి?
కారువెనుక భాగంలో నెంబర్ప్లేట్కు బదులు ఫోన్పే ప్లేట్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: వాహనం ముందు, వెనుకభాగంలో నెంబర్ప్లేట్పై (Number Plate) రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తుంటాం. కొందరు రవాణాశాఖ కార్యాలయంలో కొంత మొత్తం చెల్లించి.. తమకు కావాల్సిన లక్కీ నెంబర్లను కొనుక్కుంటారు. మరికొందరు.. కాస్త ట్రెండింగ్ కోసం నెంబర్ ప్లేట్పై అంకెలను వంకర్లు తిప్పుతుంటారు. కానీ, వీటన్నింటికీ భిన్నంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ కారు యజమాని నెంబర్ ప్లేట్ స్థానంలో.. ‘PhonePe’ అని ముద్రించుకున్నాడు. ఆ ఫొటోను సత్యన్ గజ్వానీ అనే వ్యక్తి ఎక్స్ ( ట్విటర్)లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
సత్యన్ గజ్వానీ ఆ ఫొటోను ట్వీట్ చేస్తూ.. ‘ఇది ప్రపంచ బ్రాండ్గా మారుతుందా’ అంటూ రాసుకొచ్చాడు. ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్, ఫోన్పే అధికారిక ట్విటర్ ఖాతాలను కూడా ట్యాగ్ చేశాడు. ఈ పోస్టు కారు యజమాని గౌరవ్ లోచన్ దృష్టికి వెళ్లింది. సత్యన్ గజ్వానీకి ఆయన సమాధానమిస్తూ.. అది నెంబర్ప్లేట్ కాదని, తన వ్యక్తిగత ప్లేట్ అని చెప్పారు. గతేడాది అమెరికాలో తొలి ఫోన్పే కార్యాలయాన్ని ప్రారంభించానని, దానికి గుర్తుగా తన కారు వెనుకభాగంలో అలా ప్లేట్ పెట్టానని చెప్పుకొచ్చారు. ‘మీరు పని చేస్తున్న సంస్థపై నిజమైన నమ్మకంతో ఉంటే...’ అంటూ ఎవరైనా అలా పెట్టుకోవచ్చని పరోక్షంగా చెప్పారు.
దీనిపై ట్విటర్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు గౌరవ్ లోచన్ ఆలోచనని మెచ్చకుంటుండగా.. కొందరు కారు రిజస్ట్రేషన్ నెంబర్కు సంబంధించిన క్యూఆర్ కోడ్ను కూడా ముద్రించి ఉంటే బాగుండేదని సలహా ఇస్తున్నారు. మరోవైపు ఇలా వ్యక్తిగత నెంబర్ ప్లేట్లను పెట్టుకోవడాన్ని అమెరికా, కెనడాల్లో అనుమతిస్తారు. భారత్లో లక్కీ నెంబర్లను కొనుగోలు చేసినట్లే.. అక్కడ రవాణాశాఖకు కొంత మొత్తం చెల్లించి తమకు కావాల్సిన పేర్లపై వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అయితే, నిబంధనలను కచ్చితంగా పాటించినప్పుడే ఆయా పేర్లను కేటాయిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా