China: యాంటీ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన చైనా..!
చైనా యాంటీ బాలిస్టిక్ క్షిపణిని ఆదివారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఉపరితలంపై నుంచి ప్రయోగించే క్షిపణి సాయంతో ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది.
ఇంటర్నెట్డెస్క్: యాంటీ బాలిస్టిక్ క్షిపణిని చైనా ఆదివారం రాత్రి విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఉపరితలంపై నుంచి ప్రయోగించే క్షిపణి సాయంతో ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది. పూర్తి ఆత్మరక్షణ కోసమే ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించింది. చైనా రక్షణ కోసం యాంటీ బాలిస్టిక్ మిసైల్ను అభివృద్ధి చేస్తోంది. ఇది ఖండాంతర క్షిపణులు, ఇతర ప్రొజెక్టైల్స్ను అడ్డుకొంటుంది. 2010 నుంచి చైనా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తోంది. చైనా చేపట్టిన ఆరోపరీక్ష ఇది. గతంలో 2021 ఫిబ్రవరిలో నిర్వహించింది.
ఉత్తర కొరియా - దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం గమనార్హం. అమెరికా ఈ ప్రాంతంలో దక్షిణ కొరియాతో కలిసి ఇటీవల క్షిపణి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2016లో దక్షిణ కొరియాపై ఉ.కొరియా దాడి చేస్తుందనే భయంతో టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ వ్యవస్థను మోహరించింది. ఈ విషయంలో చైనా-దక్షిణ కొరియా మధ్య విభేదాలు తలెత్తాయి. తమ జాతీయ భద్రతను ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ దెబ్బతీస్తుందని చైనా వాదించింది. ఇటీవల మేలో కూడా మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల మోహరింపుపై అమెరికాను చైనా విమర్శించింది. స్థానిక భద్రతను అగ్రరాజ్యం ప్రమాదంలో పడేస్తోందని మండిపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!