China: రెండేళ్ల తర్వాత విమాన సర్వీసుల పునరుద్ధరణ.. భారత్కు అవకాశాలపై నీలినీడలు!
కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను చైనా పునరుద్ధరించనుంది.......
దిల్లీ: కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను చైనా పునరుద్ధరించనుంది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల క్వారంటైన్ గడువును సైతం సవరించింది. అంతకుముందు వారం రోజులు ఉండగా.. ప్రస్తుతం నిర్దేశిత హోటళ్లలో 3 రోజులు, ఇళ్లలో 2 రోజులు క్వారంటైన్లో ఉండాలని సూచించింది. అమెరికా సహా 125కు పైగా దేశాలతో విమాన సర్వీసులను క్రమబద్ధీకరణకు చైనా అంగీకారం తెలిపింది. దీంతో 2,025 విమానాల రాకపోకలు ఈ వారంలో ప్రారంభమవుతాయని చైనా పేర్కొంది.
అయితే, భారత్కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై మాత్రం బీజింగ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. 2020 నవంబర్ నుంచి చైనా, భారత్ మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబాల వీసాలపై నిషేధం విధించడం వల్ల రెండేళ్లుగా వారు ఇక్కడే ఉంటున్నారు. అయితే గత నెలలో వారి వీసాలపై నిషేధం ఎత్తివేసినా.. విమాన సర్వీసులు పునరుద్ధరించపోవడం కారణంగా వారంతా తిరిగి చైనాకు వెళ్లలేకపోతున్నారు. అక్కడ చదివే 23వేల మందికిపైగా భారతీయ విద్యార్థులు కొవిడ్వీసా నిబంధనలతో ఇక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం నిబంధనలను సడలించడంతో ఆ దేశానికి వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. పేర్లు ఇవ్వాలని చైనా కోరగా ఇప్పటికే వందల మంది జాబితాను భారత్ సమర్పించింది.
మరోవైపు శ్రీలంక, పాకిస్థాన్, రష్యా లాంటి దేశాల విమానాలకు డ్రాగన్ అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా దేశాల విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో చైనాకు చేరుకుంటున్నారు. విమానాలు పునరుద్ధరించకపోవడం కారణంగా చైనాకు వెళ్లడం కష్టంగా మారిందని భారతీయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల మీదుగా ప్రయాణించడం వల్ల ఖర్చులు అధికమవుతాయని వాపోతున్నారు. విమానాల అనుమతిపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు