Philippines: ఫిలిప్పీన్స్ ద్వీపంపైకి చొచ్చుకెళ్లిన చైనా నౌకలు
ఫిలిప్పీన్స్ ఆధీనంలోని ద్వీపం వద్ద చైనా నౌకలు హల్చల్ చేశాయి. ఆ ద్వీపాలకు సమీపంలోకి వెళ్లి ప్రాదేశీక జలాల హద్దులను ఉల్లంఘించాయి.
ఇంటర్నెట్డెస్క్: చైనా(China) మరోసారి తన పొరుగు దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొంది. ఈ సారి ఫిలిప్పీన్స్(Philippines) ఆధీనంలోని ఓ ద్వీపం వద్దకు చైనా నావికాదళానికి చెందిన నౌకలు, చేపలవేట ముసుగులో మిలీషియా పడవలు దూసుకెళ్లాయి. దీంతో ఇరు దేశాల మధ్య ప్రాదేశిక జలాల విషయంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్ నేవీ కూడా ధ్రువీకరించింది.
చైనాకు చెందిన 42 మిలీషియా పడవలను ‘థిటు’ ద్వీపానికి అత్యంత సమీపంలో చూసినట్లు ఫిలిప్పీన్స్ పేర్కొంది. వీటికి కొద్ది దూరంలో చైనాకు చెందిన కోస్టుగార్డ్, నౌకాదళ ఓడలు నిదానంగా కదులుతున్నట్లు గుర్తించామని పేర్కొంది. ‘‘వారు నిరంతరాయం అక్కడే ఉండటం ఫిలిప్పీన్స్ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే’’ అని ఫిలిప్పీన్స్ కోస్టుగార్డ్ పేర్కొంది. ఈ నౌకల చిత్రాలను కోస్ట్గార్డ్ ట్విటర్లో విడుదల చేసింది.
మనీలాలోని చైనా రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. దక్షిణ చైనా సముద్రంలో థిటు ద్వీపం ఫిలిప్పీన్స్కు ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక ప్రాంతం. కానీ, దీని సమీపంలోని సముద్ర జలాలను చైనా తనవిగా వాదిస్తోంది. ఇప్పటికే చైనా వ్యవహారశైలిపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రెండువారాల క్రితం ఆయన స్పందిస్తూ.. ‘‘ ఒక్క అంగుళం భూమి కూడా పోగొట్టుకోము’’ అని తేల్చిచెప్పారు.
థిటు ద్వీపం పశ్చిమ ఫిలిప్పీన్స్లోని పాల్వన్ ప్రావిన్స్కు 300 మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడ కేవలం 400 మంది జనాభా మాత్రమే ఉన్నారు. వీరిలో సైనికులు, లా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కూడా ఉన్నారు. మనీలా ప్రాదేశిక జలాలపై హక్కు కాపాడుకోవడానికి ఈ ద్వీపం చాలా కీలకం. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం చేయడానికి చైనా చేపల పడవలను, కోస్టుగార్డులను ఆయుధాలుగా వాడుకొంటోంది. నిరంతరం ఈ పడవలు వివాదాస్పద ప్రాంతాల్లో ఉండటంతో ఇతరులు అక్కడ చేపల వేట నిర్వహించడం, చమురు అన్వేషణ చేపట్టడం కష్టంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!