అమ్మకానికి ఓ గ్రామం.. దాదాపు రూ.2 కోట్లకే 44 ఇళ్లు..!
స్పెయిన్లోని సాల్టో డే కాస్ట్రో అనే గ్రామాన్ని విక్రయానికి ఉంచారు. కేవలం సుమారు రూ.2కోట్లకే గ్రామంలోని దాదాపు 44 ఇళ్లు సొంతం చేసుకోవచ్చనే ప్రకటనపై పలు దేశాలను ఆకర్షిస్తోంది. దీన్ని సొంతం చేసుకోవడానికి వందల మంది ఆసక్తి చూపుతుండటం విశేషం.
మాడ్రిడ్: సొంతంగా ఓ ఇల్లు లేదా ఖరీదైన విల్లా కొనుగోలు చేయాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అందుకోసం కొన్ని లక్షల రూపాయల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టి తమ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అదే డబ్బుతో ఏకంగా ఓ గ్రామాన్నే కొనొచ్చంటే.. అది నిజంగా ఆశ్చర్యమే కదా..! అవును. స్పెయిన్లోని ఓ గ్రామాన్ని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు (Village for Sale). ధర కూడా అందుబాటులోనే. కేవలం 2,27,000 యూరోలకే (సుమారు రూ.2కోట్లు మాత్రమే) గ్రామం మొత్తం సొంతం చేసుకోవచ్చు.
స్పెయిన్లోని సాల్టో డే కాస్ట్రో (Salto de Castro) అనే గ్రామం పోర్చుగల్ సరిహద్దులో ఉంది. రాజధాని మాడ్రిడ్ నుంచి మూడు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. 1950ల్లో ఆ ప్రాంతంలో ఓ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ సమయంలో కార్మికుల కోసం విద్యుత్ ఉత్పత్తి సంస్థ నివాసాలు ఏర్పాటు చేసింది. అయితే, ఆ ప్రాజెక్టు పూర్తైన తర్వాత అక్కడివారంతా సమీప పట్టణాలకు తరలిపోవడం మొదలుపెట్టారు. ఇలా 1990 చివరి నాటికి ఆ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. అక్కడ 44 ఇల్లు, ఓ హోటల్, చర్చి, పాఠశాల, స్విమ్మింగ్ పూల్తోపాటు ఇతర సదుపాయాలున్నాయి.
అయితే, ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 2000ల్లో ఆ గ్రామాన్నిఓ కుటుంబం కొనుగోలు చేసింది. కానీ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఆ ప్రణాళికను విజయవంతం చేయలేకపోయింది. దీంతో చివరకు ఆ గ్రామాన్ని విక్రయించాలని నిర్ణయించిన కుటుంబం.. స్పెయిన్కి చెందిన ప్రముఖ ప్రాపర్టీ వెబ్సైట్లో (Idealista)లో వివరాలను పొందుపరిచింది. పట్టణంలో నివాసముంటున్నందున ఈ గ్రామాన్ని విక్రయిస్తున్నానని ఆ గ్రామ యజమాని వివరించారు.
నవంబర్ తొలివారంలో ఆ ప్రకటన పోస్టు చేయగా.. భారీ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50వేల మంది ఆ ప్రాపర్టీ వివరాలను చూడగా.. రష్యా, ఫ్రాన్స్, బెల్జియంతోపాటు బ్రిటన్కు చెందిన 300 మంది ఆ గ్రామాన్ని కొనేందుకు ముందుకు వచ్చినట్లు విక్రయానికి ఉంచిన సంస్థ ప్రతినిధి రోడ్రిగజ్ పేర్కొన్నారు. అయితే, గతంలోనూ ఈ గ్రామాన్ని అమ్మకానికి పెట్టినప్పటికీ భారీ ధర ఉండటంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈసారి మాత్రం మార్కెట్ విలువ అంచనా వేసి ధర నిర్ణయించడంతో ఈ గ్రామాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM