రష్యాలో ఉంటే మిమ్మల్ని మేం రక్షించలేం
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. వెంటనే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరులకు సూచించింది.
తక్షణం దేశం విడిచి వెళ్లండి
తమ పౌరులను హెచ్చరించిన అమెరికా
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. వెంటనే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరులకు సూచించింది. ఉక్రెయిన్లో తీవ్రతరమవుతోన్న దాడులతోపాటు రష్యా భద్రతాసంస్థల నుంచి ఏకపక్ష అరెస్టులు, వేధింపుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ‘‘రష్యాలో నివసిస్తున్న లేదా పర్యటిస్తోన్న అమెరికా జాతీయులు వెంటనే దేశాన్ని వీడి బయలుదేరాలి’ అని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. మాస్కోకు దూరంగా ఉన్న పౌరుల భద్రతను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్యవేక్షించలేమని, ఏదైనా ముప్పు ఎదురైనా రక్షించలేమని పేర్కొంది. తప్పుడు నిర్బంధాల అవకాశం నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. దీంతోపాటు అమెరికన్లను రష్యాకు వెళ్లొద్దని పేర్కొంది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో అమెరికా పౌరుడిపై క్రిమినల్ కేసు ప్రారంభించినట్లు రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఇటీవల తెలిపిన వేళ తాజా ప్రకటన వచ్చింది. ‘రష్యన్ భద్రతాసంస్థలు కొంతమంది అమెరికా పౌరులను తప్పుడు ఆరోపణలపై అరెస్టు చేశాయి. అమెరికన్లను నిర్బంధించడంతోపాటు వేధింపులకు పాల్పడుతున్నాయి. పైగా, వారికి న్యాయమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు నిరాకరించాయి. సరైన సాక్ష్యాలు సమర్పించకుండానే రహస్య విచారణల్లో వారిని దోషులుగా తేల్చాయి’ అని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ముఖ్యంగా అమెరికన్ మత బోధకులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాను విడిచి వెళ్లాలని అమెరికా తన పౌరులను గతంలోనూ పలుమార్లు హెచ్చరించింది. చివరగా గతేడాది సెప్టెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనిక సమీకరణకు ఆదేశించిన సమయంలో ఈ మేరకు ప్రకటన చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.