Britian: ముగ్గురి డీఎన్ఏలతో ముద్దుల చిన్నారులు!
వంశపారంపర్యంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను నివారించడం ద్వారా ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే ప్రయోగాత్మక విధానాన్ని బ్రిటన్ పరిశోధకులు తాజాగా విజయవంతంగా అమలుపరిచారు.
బ్రిటన్ చరిత్రలో తొలిసారి జననం
‘మైటోకాండ్రియా దానం’ విధానంలో సాకారం
లండన్: వంశపారంపర్యంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను నివారించడం ద్వారా ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే ప్రయోగాత్మక విధానాన్ని బ్రిటన్ పరిశోధకులు తాజాగా విజయవంతంగా అమలుపరిచారు. తమ దేశ చరిత్రలో తొలిసారిగా.. ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏను పంచుకుంటూ శిశువులు జన్మించేలా చేశారు. ‘మైటోకాండ్రియా దానం’ అనే వినూత్న విధానాన్ని ఇందుకు ఉపయోగించారు. బ్రిటన్లోని ‘మానవ ఫలదీకరణ, పిండోత్పత్తి ప్రాధికార సంస్థ’ బుధవారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ విధానంలో ఎంతమంది శిశువులు పుట్టారన్న సంగతిని స్పష్టంగా వెల్లడించలేదు. వారి సంఖ్య 5 కంటే తక్కువ అని మాత్రమే పేర్కొంది. ఆయా కుటుంబాల గోప్యతను పరిరక్షించేందుకే పూర్తి వివరాలు బయటపెట్టడం లేదని తెలిపింది.
కణ శక్తి భాండాగారాల్లో లోపంతో..
కణాల్లోని అత్యంత కీలక భాగాల్లో మైటోకాండ్రియా ఒకటి. దాన్ని ‘కణ శక్తి భాండాగారం’ అని పిలుస్తారు. కొంతమంది మహిళల్లో జన్యుపరమైన సమస్యల కారణంగా మైటోకాండ్రియాలు సరిగా పనిచేయవు. ఆ పరిస్థితిని ‘ఫాల్టీ మైటోకాండ్రియా’గా పిలుస్తారు. అలాంటి మహిళల సంతానానికీ.. వంశపారంపర్యంగా జన్యులోపాలు సంక్రమిస్తాయి. వాటివల్ల కండరాల బలహీనత, మూర్చ వంటి వ్యాధులతో పాటు గుండె సమస్యలు, మేధోపరమైన వైకల్యాలు తలెత్తుతుంటాయి. బ్రిటన్లో దాదాపుగా ప్రతి 200 మంది చిన్నారుల్లో ఒకరు ఈ మైటోకాండ్రియా సంబంధిత రుగ్మతతో జన్మిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏమిటీ ప్రయోగాత్మక విధానం?
ఫాల్టీ మైటోకాండ్రియాతో బాధపడుతున్న మహిళల సంతానానికి ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు పరిశోధకులు వినూత్న విధానాన్ని ఆవిష్కరించారు. ఇందులో తొలుత బాధిత మహిళ అండం నుంచి జన్యుపదార్థాన్ని సేకరిస్తారు. ఆ పదార్థాన్ని దాత అండంలో ప్రవేశపెడతారు. అంతకుముందే- దాత అండం నుంచి కీలక జన్యుపదార్థాన్ని తొలగిస్తారు. ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియాను (ఇందులోనూ దాత డీఎన్ఏ కొంత ఉంటుంది) మాత్రం అందులోనే ఉంచుతారు. ఆపై అండాన్ని ఫలదీకరణం చెందించి.. తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. ఈ విధానంలో జన్మించే శిశువులో దాతకు సంబంధించిన జన్యుపదార్థం 1% కంటే తక్కువే ఉంటుంది. తండ్రితో కలిపితే మొత్తంగా ముగ్గురి డీఎన్ఏ శిశువులో ఉంటుందన్నమాట.
* మైటోకాండ్రియా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలు ఈ విధానం ద్వారా ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందొచ్చు. అయితే వంశపారంపర్యంగా వచ్చే లోపాలను అధిగమించేందుకు ఇతర మార్గాలేవీ అందుబాటులో లేనప్పుడు మాత్రమే బాధితులకు ఈ సాంకేతికతను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తామని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధానంలో జన్మించే పిల్లలకు భవిష్యత్తులో తిరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదని పలువురు నిపుణులు పేర్కొన్నారు. మైటోకాండ్రియా దానం విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించినట్లు 2016లోనే అమెరికా ప్రకటించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!