భారతీయ నిపుణులకు బ్రిటన్‌ వీసా

భారతీయ గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు బ్రిటన్‌లో రెండేళ్లపాటు నివసిస్తూ చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వీలు కల్పించే యూకే-ఇండియా యువ వృత్తి నిపుణుల పథకం కింద రెండో బ్యాలట్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది.

Updated : 26 Jul 2023 07:51 IST

లండన్‌: భారతీయ గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు బ్రిటన్‌లో రెండేళ్లపాటు నివసిస్తూ చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వీలు కల్పించే యూకే-ఇండియా యువ వృత్తి నిపుణుల పథకం కింద రెండో బ్యాలట్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. బ్యాలట్‌ జూలై 27తో ముగుస్తుంది. ఈ పథకం కింద దాదాపు 3 వేల మంది భారతీయ ఉన్నత విద్యావంతులు 2023 సంవత్సరానికి బ్రిటన్‌లో ప్రవేశానికి వీసా పొందగలుగుతారు. ఫిబ్రవరిలో జరిగిన మొదటి బ్యాలట్‌లోనే చాలా స్థానాలు భర్తీ కాగా, మిగిలిన స్థానాలను రెండో బ్యాలట్‌లో భర్తీచేస్తారు. జకార్తాలో గత నవంబరులో భారత ప్రధాని మోదీ, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ పథకం అమలులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని