చైనాలో పిల్లలకు రోజుకు 2 గంటలే ఫోన్.. రాత్రిపూట ఇంటర్నెట్ బంద్
చైనా చిన్నారులు ఇంటర్నెట్కు బానిసలుగా మారిపోయారని జిన్పింగ్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
ముసాయిదా విడుదల
బీజింగ్: చైనా చిన్నారులు ఇంటర్నెట్కు బానిసలుగా మారిపోయారని జిన్పింగ్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే తీసుకున్న అనేక చర్యలకు కొనసాగింపుగా తాజా నిబంధనలు రూపొందించింది. ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే విషయంలో చైనాలో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి. చిన్నారులు పగటిపూట ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకే పరిమితం చేస్తూ 2019లో ఆంక్షలు విధించింది. శుక్ర, శని, ఆదివారాలతోపాటు సెలవుల రోజుల్లో ఈ సమయాన్ని గంటకే పరిమితం చేస్తూ 2021లో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. తాజాగా చైనా చిన్నారులకు స్మార్ట్ఫోను వాడకంపై మరిన్ని సరికొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మైనర్లు స్మార్ట్ఫోను ఉపయోగించే సమయాన్ని రోజుకు గరిష్ఠంగా రెండు గంటలకు పరిమితం చేస్తూ జిన్పింగ్ సర్కారు ఆంక్షలను తీసుకొస్తోంది. చైనా అంతర్జాల నియంత్రణ సంస్థ అయిన ‘సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా’ (సీఏసీ) ఇందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం..
- మైనర్లకు రాత్రి 10.00 నుంచి ఉదయం 6.00 గంటల మధ్య ఇంటర్నెట్లోని చాలా సేవలు మొబైల్ ద్వారా అందుబాటులో ఉండవు.
- 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్నవారు రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఈ సమయం గంటకే పరిమితం. ఎనిమిదేళ్లలోపు వారికైతే 40 నిమిషాలు మాత్రమే అంతర్జాలం వాడుకునే అనుమతి ఉంటుంది.
- ఈ ఆంక్షల నుంచి కొన్ని సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. మైనర్ల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడే యాప్స్, ప్లాట్ఫాంలకు ఆంక్షలు వర్తించవు. అయితే, నిర్దిష్టంగా ఏయే సేవలకు ఇంటర్నెట్ ఆంక్షల మినహాయింపు ఉంటుందనే విషయాన్ని సీఏసీ చెప్పలేదు.
- ఇంటర్నెట్ ప్లాట్ఫాంలలో ‘యూత్ మోడ్’ను తీసుకొచ్చేలా చైనా ఇప్పటికే చర్యలు తీసుకుంది. చిన్నారులకు వారి వయసుకు తగిన సమాచారం అందేలా నిబంధనలు తీసుకొచ్చింది. యూత్ మోడ్ ప్రవేశపెట్టిన తర్వాత సానుకూల ఫలితాలు వచ్చాయని సీఏసీ వెల్లడించింది. చిన్నారులు మొబైల్స్కు అతుక్కుపోవడం కూడా తగ్గినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తాజా ముసాయిదా నిబంధనలపై సెప్టెంబరు 2లోపు స్పందనలు తెలపాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. సీఏసీ తీసుకొచ్చిన కొత్త ఆంక్షలు షార్ట్ వీడియో, ఆన్లైన్ వీడియో ప్లాట్ఫాంలతోపాటు గేమింగ్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?