టీకా యోధులకు నోబెల్
కొవిడ్ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్లను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది.
వైద్య రంగంలో పురస్కారాన్ని గెల్చుకున్న కాటలిన్, వెయిస్మన్
వీరి కృషితో కొవిడ్కు సకాలంలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు
ఎంపిక కమిటీ కితాబు
స్టాక్హోం: కొవిడ్ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్లను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. కరోనా వైరస్కు వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వీరిద్దరి పరిశోధనలు దోహదపడ్డాయని అవార్డు ఎంపిక కమిటీ కొనియాడింది. కాటలిన్ స్వస్థలం హంగరీ కాగా, అమెరికాలో స్థిరపడ్డారు. వైద్యశాస్త్రంలో నోబెల్కు ఎంపికైన 13వ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. అమెరికన్ శాస్త్రవేత్త వెయిస్మన్తో కలసి ఆమె సాగించిన పరిశోధనల వల్ల ఎంఆర్ఎన్ఏ.. రోగనిరోధక వ్యవస్థతో చర్యలు జరిపే తీరుపై సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎన్నో ఇబ్బందులను అధిగమించి..
కాటలిన్ (68).. ప్రస్తుతం అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీతోపాటు హంగరీలోని సెగెడ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. బయోఎన్టెక్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ.. ఫైజర్తో కలిసి కొవిడ్-19 టీకాలను అభివృద్ధి చేసింది. వెయిస్మన్ (64) పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కాటలిన్.. 1970లలో హంగరీలో కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత అమెరికా వలస వెళ్లారు. అప్పటికి ఎంఆర్ఎన్ఏపై పరిశోధనలు చాలా కొత్త. ఆమె తొలుత అమెరికాలోని టెంపుల్ విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత పెన్సిల్వేనియా వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్లో పరిశోధనలు మొదలుపెట్టారు. ఎంఆర్ఎన్ఏ పరిశోధనలపై విశ్వవిద్యాలయ అధికారుల్లో తొలుత ఆసక్తి వ్యక్తమైనా.. ఆ తర్వాత నీరుగారింది. వ్యాధులపై పోరుకు ఈ సాంకేతికతను వాడొచ్చన్న కాటలిన్ ప్రతిపాదనకు తిరస్కరణలే ఎదురయ్యాయి. ఆ పరిశోధనకు నిధులు సమకూర్చడం రిస్కుతో కూడుకున్న వ్యవహారమని వర్సిటీ అధికారులు తేల్చి చెప్పేశారు.
1995లో అధికారులు ఆమె హోదాను కూడా తగ్గించేశారు. అదే సమయంలో ఆమె క్యాన్సర్ బారినపడ్డారు. ఆ సమయంలో ఒక్కసారిగా ముంచెత్తిన కష్టాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత పెన్సిల్వేనియా వర్సిటీలో వెయిస్మన్తో కలిసి పరిశోధనలు సాగించిన కాటలిన్.. ఉమ్మడిగా ఒక విధానాన్ని కనుగొన్నారు. అందులో వారు ఆర్ఎన్ఏలోని న్యూక్లియోసైడ్ బేస్ను మార్చేశారు. ఫలితంగా ఎంఆర్ఎన్ఏకు మన రోగనిరోధక స్పందన నుంచి ఇబ్బంది తొలగిపోయింది. దీనిపై 2005లో కాటలిన్, వెయిస్మన్లు ఒక పరిశోధన పత్రం ప్రచురించారు. అప్పట్లో అది అంతగా గుర్తింపు పొందనప్పటికీ.. కొవిడ్ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరి పరిశోధనలు కీలక పాత్ర పోషించాయి. ఫలితంగా 2020 చివర్లో రెండు ఎంఆర్ఎన్ఏ టీకాలకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఆ వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధించడమేగాక.. కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగాయి అని నోబెల్ ఎంపిక కమిటీ వెల్లడించింది.
నోబెల్ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది కాస్త పెంచారు. గతేడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల నగదు అందజేయగా.. ఈసారి దాన్ని 11 మిలియన్ల క్రోనర్లకు పెంచారు. ఈ కరెన్సీ విలువ పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఎంఆర్ఎన్ఏ అంటే...
సంప్రదాయ టీకాల తయారీ విధానంలో.. లక్షిత వైరస్లు లేదా అందులోని భాగాలను భారీగా వృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని శుద్ధిచేసి, తదుపరి దశల్లో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో సజీవ లేదా బలహీనపరచిన వైరస్లను శరీరంలోకి చొప్పించాల్సి ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ ఆర్ఎన్ఏ) విధానం ఇందుకు పూర్తి భిన్నమైంది. ఇందులో తాత్కాలిక జన్యు సంకేతం ఉంటుంది. లక్షిత వైరస్లోని ఎంపిక చేసిన భాగాన్ని ఉత్పత్తి చేయాలంటూ మన కణాలకు ఆదేశాలు అందులో ఉంటాయి. దాన్ని మన కణాలు ‘చదివి’.. ఆ ప్రొటీన్ను తయారుచేస్తాయి. అంటే.. మన శరీరమే ఒక మినీ టీకా కర్మాగారంగా మారిపోతుందన్నమాట! అలా ఉత్పత్తయిన ప్రొటీన్ ఆధారంగా మన రోగనిరోధక వ్యవస్థ స్పందించి.. సంబంధిత ప్రొటీన్లను అడ్డుకునే యాంటీబాడీలు, ఇతర ప్రత్యేక కణాలను తయారుచేస్తుంది. తద్వారా.. భవిష్యత్లో సంబంధిత వైరస్ సోకినప్పుడు వెంటనే స్పందించి, ఇన్ఫెక్షన్కు అడ్డుకట్టవేసేలా ముందే శిక్షణ పొందుతుంది. ఎంఆర్ఎన్ఏ టీకా తయారీకి వైరస్ అవసరం ఉండదు. అయితే, ల్యాబ్లో వృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏను చొప్పించడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేటరీ ప్రతిచర్య తలెత్తుతుంది. అది ఎంఆర్ఎన్ఏను నాశనం చేస్తుంది. ఈ ఇబ్బందిని అధిగమించే విధానాన్ని కాటలిన్, వెయిస్మన్లు కనుగొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!