Boris johnson: జాన్సన్ను వీడని మందు వాసన..
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనా లాక్డౌన్ ఆంక్షల్ని ఉల్లంఘించి మందు పార్టీలు చేసుకున్నారనే ఆరోపణల జోరు తగ్గడం లేదు.
లాక్డౌన్ సమయంలో ఆరు పార్టీలు
తాజా ఆరోపణల్లో బ్రిటన్ ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కరోనా లాక్డౌన్ ఆంక్షల్ని ఉల్లంఘించి మందు పార్టీలు చేసుకున్నారనే ఆరోపణల జోరు తగ్గడం లేదు. పార్టీ గేట్గా పేరుపడిన ఈ వ్యవహారంలో సోమవారం కొత్త ఆరోపణలు వచ్చాయి. లాక్డౌన్ కాలంలో జరిగిన 12 మందు పార్టీల్లో ఆరింటితో జాన్సన్ పేరు ముడిపడిందని బ్రిటిష్ ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. 2020 జూన్లో తన పుట్టినరోజు నాడు మద్యంతో విందు చేసుకున్నారనే ఆరోపణపై జాన్సన్కు ఇప్పటికే జరిమానా విధించారు. మంత్రివర్గ సమావేశ మందిరంలో జరిగిన ఈ విందుకు కేకు తీసుకొచ్చిన జాన్సన్ భార్య క్యారీకి, ఆర్థిక మంత్రి రిషి సునాక్కు కూడా జరిమానా పడింది. తరవాత 2020 నవంబరులో ప్రధానమంత్రి నివాసంలో కమ్యూనికేషన్ల డైరెక్టర్ పదవి నుంచి లీ కైన్ రిటైరవుతున్న సందర్భంలో జాన్సన్ ప్రోద్బలం తోనే మరో మందు పార్టీ జరిగిందని ‘సండే టైమ్స్’ పత్రిక తాజాగా వెల్లడించింది. జాన్సన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా కాలంలో బ్రిటిష్ ప్రజలు త్యాగాలు చేస్తుంటే, ప్రధాని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఉప నాయకురాలు ఏంజెలా రేనర్ విమర్శించారు. స్కాట్లండ్ యార్డ్ దర్యాప్తు ముగిసేవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని ప్రధాని అధికారిక నివాసం ప్రకటించింది. మంగళవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ సమస్యపైకి, ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే భారతదేశ పర్యటనపైకి సభ్యుల దృష్టిని మళ్లించవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ గేట్ వేడి నుంచి కొద్ది రోజులపాటు తప్పించుకోవడానికి ఆయనకు అవకాశం ఉంటుందని వినవస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!