శ్వేతసౌధం సమీపంలో పిడుగుపాటు

అమెరికా అధ్యక్ష కార్యాలయం వెలుపల పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. శ్వేత సౌధానికి ఎదురుగా ఉన్న లఫాయెట్‌ పార్క్‌లో గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో

Published : 06 Aug 2022 04:19 IST

ఇద్దరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష కార్యాలయం వెలుపల పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. శ్వేత సౌధానికి ఎదురుగా ఉన్న లఫాయెట్‌ పార్క్‌లో గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చెంతనే పిడుగు పడిందని అధికారులు శుక్రవారం తెలిపారు. వీరిలో ఒక మహిళ, పురుషుడు మరణించగా, మరో మహిళ, పురుషుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.  పిడుగుపాటు అనంతరం అక్కడకు చేరుకున్న సీక్రెట్‌ సర్వీస్‌, యూఎస్‌ పార్క్‌ పోలీసులు అత్యవసర సేవల విభాగం సిబ్బందికి సమాచారం అందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ముందుజాగ్రత్తగా పార్క్‌లో కొంత భాగాన్ని అధికారులు గంటసేపు మూసివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని