క్యూబాలో చమురు క్షేత్రంపై పిడుగు 80 మందికి గాయాలు

క్యూబాలోని ఓ చమురు క్షేత్రంపై పిడుగుపడి భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 80 మంది గాయపడ్డారు. మరో 17 మంది అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు. మతంజాస్‌ సూపర్‌ట్యాంకర్‌

Published : 07 Aug 2022 05:42 IST

హవానా: క్యూబాలోని ఓ చమురు క్షేత్రంపై పిడుగుపడి భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 80 మంది గాయపడ్డారు. మరో 17 మంది అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు. మతంజాస్‌ సూపర్‌ట్యాంకర్‌ బేస్‌ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత ఒక ట్యాంకుపై పిడుగుపడి.. పక్కనున్న ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. చమురు కొరతతో అల్లాడుతున్న క్యూబాలో జరిగిన ఈ ప్రమాదం దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని