Imran Khan: భారత్ను మళ్లీ ప్రశంసించిన ఇమ్రాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్ భారత్ను మరోసారి కొనియాడారు. ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందని
లాహోర్ సభలో కేంద్ర మంత్రి జైశంకర్ వీడియో ప్రదర్శన
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్ భారత్ను మరోసారి కొనియాడారు. ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందని మెచ్చుకున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడిన వీడియోను ఆయన బహిరంగ సభలో ప్రదర్శించారు. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి తక్కువ ధరకు భారత్ చమురు కొనుగోలు చేసిందని ప్రశంసించారు. లాహోర్ జాతీయ హాకీ స్టేడియంలో శనివారం అర్ధరాత్రి కిక్కిరిసిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్, పాకిస్థాన్ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయని, విదేశాంగ విధానం విషయంలో భారత్ ప్రజానుకూల నిర్ణయాలను తీసుకుంటోందని ఇమ్రాన్ చెప్పారు. ఐరోపా దేశాలు రష్యా నుంచి గ్యాస్ను కొనుగోలు చేస్తున్నాయని, భారత ప్రజల కోసం తామూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని జైశంకర్ ప్రశ్నించిన వీడియోను ఇమ్రాన్ ప్రదర్శించారు. పాకిస్థాన్ ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడికి లొంగిపోతోందని విమర్శించారు. 2023 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేలా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను లండన్ నుంచి వెనక్కు రప్పించేందుకు వీలుగా ఆయనపై ఉన్న జీవితకాల అనర్హత వేటును తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు