Israel-Hamas: యుద్ధం ఆగినా.. ఇజ్రాయెల్ వేట కొనసాగేనా?
వివిధ దేశాల్లో తలదాచుకుంటున్న హమాస్ (Israel-Hamas) ఉగ్రవాద సంస్థలోని కీలక నేతల్ని మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచ దేశాల ఒత్తిడితో ఒక వేళ గాజాపై (Gaza) దాడులు విరమించినా.. హమాస్ ఉగ్రవాద సంస్థలోని కీలక నేతలను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక కథనం వెలువరించింది. ఈ విషయంలో ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు..పూర్వపు ప్రధాని గోల్డా మెయిర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ శత్రువులను అంతం చేసేందుకు గోల్డా మెయిర్ ‘ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్’ను చేపట్టారు. తాజాగా నెతన్యాహు కూడా.. వివిధ దేశాల్లో ఉన్న హమాస్ కీలక నేతలను ఏరివేసేలా తమ దేశ నిఘా సంస్థ మొసాద్కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
నెతన్యాహు ఆదేశాల మేరకు మొసాద్ కూడా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. హమాస్లో కీలక నేతలు ఎవరు? వాళ్లు ఏయే దేశాల్లో ఉంటున్నారు? తదితర వివరాలు ఇప్పటికే నెతన్యాహు దగ్గర ఉన్నట్లు అమెరికా వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది. సాధారణంగా హమాస్లోని కీలక నేతలంతా తుర్కియే, లెబనాన్, ఖతార్ దేశాల్లో ఉంటున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వాళ్లను మట్టుబెట్టేందుకు ట్రాక్.. హంట్..కిల్.. ( అనుసరించు.. వేటాడు.. చంపు) అనే సూత్రాన్ని ఇజ్రాయెల్ పాటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ అనుసరించబోయే వ్యూహంపై మొసాద్ మాజీ డైరెక్టర్ ఎఫ్రైమ్ హేలేవి ఆందోళన వ్యక్తం చేసినట్లు అమెరికా పత్రిక పేర్కొంది. ఇలాంటి అనాలోచిత చర్యలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని, ఇజ్రాయెల్ దేశాన్ని మరింత అస్థిరపరుస్తాయని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా హమాస్ లక్ష్యాలను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే.. ఇజ్రాయెల్కు ముప్పు తప్పదని ఆయన అభిప్రాయపడినట్లు వెల్లడించింది. ‘‘ ప్రపంచ వ్యాప్తంగా హమాస్ మూలాలను అంతమొందించాలను కోవడం ప్రతీకారం తీర్చుకోవడమే తప్ప.. తమ లక్ష్యాన్ని సాధించినట్లు కాదు’’ అని హేలేవి పేర్కొన్నారు.
హిట్ లిస్ట్లో ఉన్నది వీళ్లే..
ఇస్మాయిల్ హనియే
60 ఏళ్ల ఇస్మాయిల్ హనియే గతంలో పాలస్తీనా ప్రధానమంత్రిగా సేవలందించారు. 2017లో హమాస్ పొలిటికల్ బ్యూరో అధిపతిగా ఎన్నికయ్యారు. 2006లో అతడు ప్రధానిగా ఉన్న సమయంలో విషం పూసిన లేఖను ఆయనకు పంపి..అంతమొందించేందుకు కుట్ర జరిగింది. ప్రస్తుతం హమాస్ కార్యకలాపాలకు దూరంగా తుర్కియే- ఖతార్ మధ్య ప్రాంతంలో ఉంటున్నట్లు సమాచారం.
మహ్మద్ డెయిఫ్
హమాస్ మిలటరీ విభాగానికి మహ్మద్ డెయిఫ్ అధ్యక్షుడు. ఇతడిని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు దాదాపు 6 సార్లు ప్రయత్నించి విఫలమైంది. అమెరికా రూపొందించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో 2015 నుంచి ఇతడి పేరు ఉంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమం సమయంలో బయటపడిన వాయిస్ మెసేజ్లో మాట్లాడింది ఈయనేనని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ప్రస్తుతం ఇతడు ఎక్కడ ఉన్నాడన్నది స్పష్టంగా తెలియకపోయినా.. గాజా స్ట్రిప్లోనే ఉంటూ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటున్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది.
యహ్యా సిన్వార్
61 ఏళ్ల యహ్యా సిన్వార్.. హమాస్ మిలటరీ విభాగం బ్రిగేడ్స్ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. 2017లో గాజాలోని హమాస్ విభాగానికి సిన్వార్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. దాదాపు 23 ఏళ్లకుపైగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న ఇతడు.. 2011లో విడుదలయ్యాడు. ఫ్రాన్స్-ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షలిత్ను అపహరించిన హమాస్ ఉగ్రవాదులు.. అతడిని అప్పగించాలంటే సిన్వార్ను విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అప్పగించింది.
ఖలేద్ మషల్
ఖలేద్ మషల్.. హమాస్ పొలిట్బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు. 2017 వరకు పొలిట్బ్యూరో ఛైర్మన్గానూ వ్యవహరించాడు. ప్రస్తుతం ఇతడు ఖతార్లో ఉన్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. 1997లో జోర్డాన్ వెళ్లిన ఇతడిపై మొసాద్ ఏజెంట్లు హత్యాయత్నం చేశారు. కెనడా టూరిస్టుల వేషంలో వెళ్లి.. అతడి కళ్లల్లోకి ప్రమాదకరమైన స్ప్రే కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. అతడిని కిడ్నాప్ చేసిన మొసాద్ ఏజెంట్లు రహస్య ప్రదేశంలో బంధించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో.. ఆ సమయంలో మొసాద్ చీఫ్గా ఉన్న డానీ విరుగుడు మందుతో జోర్డాన్ రాజధాని అమ్మన్కు వెళ్లాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
స్లొవేకియా ప్రధాని రాబర్డ్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. -
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..