Coco Islands: కోకో ద్వీపంలో చైనా నిఘాపై మయన్మార్ను ప్రశ్నించిన భారత్
కోకో ద్వీపంలో చైనా కార్యకలాపాలు పెరగడంపై భారత్ మయన్మార్ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్కడ చైనా ఎటువంటి కార్యకలాపాలను జరపడంలేదంటూ మయన్మార్ సైనిక పాలకులు వెల్లడించినట్లు తెలిసింది.
ఇంటర్నెట్డెస్క్: బంగాళఖాతంలో మయన్మార్(Myanmar)కు చెందిన కోకో ద్వీపం(Coco Island)లో చైనా(China) నిఘా కేంద్రం ఏర్పాటు చేయడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ క్షిపణి ప్రయోగ కేంద్రమైన బాలేశ్వర్, వ్యూహాత్మక జలాంతర్గాములకు నివాసమైన వైజాగ్పై నిఘా పెట్టేందుకు చైనా ఇక్కడ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొంది. ఈ విషయాన్ని భారత్ మయన్మార్ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై మయన్మార్ వివరణ సంతృప్తికరంగా లేనట్లు తెలుస్తోంది. భారత్ ఆరోపణలను మయన్మార్ సైనిక పాలకులు తేలిగ్గా కొట్టిపారేశారు.. ఈ ద్వీపంలో విమానాల రన్వే పొడిగింపులో చైనా పాత్ర ఏమాత్రం లేదని పేర్కొన్నారు.
మరోవైపు భారత భద్రతా సంస్థలకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ రవాణా విమానాల రాకపోకలకు వీలుగా రన్వే అభివృద్ధి చేసినట్లు తెలిసింది. దాదాపు 1500 మంది వర్కర్లు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఉపగ్రహ చిత్రాల్లో కోకో దీవుల దక్షిణ కొనపై కొత్తగా ఒక కాజ్వే, వసతి సముదాయం తదితరాలను నిర్మిస్తున్నట్టు తేలింది. రన్వే, రాడార్ స్టేషన్కు సమీపంలోనే ఇవన్నీ ఉన్నాయి. భారత యుద్ధనౌకల కదలికలను క్షుణ్ణంగా గమనించడమే ఈ స్థావరం ఉద్దేశం. ఈ పరిణామం భారత్కు ఆందోళనకరమే.
2021లో తిరుగుబాటు తర్వాత అంతర్జాతీయంగా ఏకాకి కావడంతో మయన్మార్ సైనిక పాలకులు పూర్తిగా చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో చైనా కూడా 4 బిలియన్ డాలర్లు మయన్మార్కు సర్దుబాటు చేసింది. దీంతోపాటు బీఆర్ఐ ప్రాజెక్టులోకి చేర్చుకొనేందుకు యత్నించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!