Rape:మత్తులో ఉన్న మహిళను రూమ్కి తీసుకొచ్చి.. అత్యాచారం చేసి..!
ఇంగ్లాండ్లో భారత సంతతికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఉన్న మహిళను తన రూమ్కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
దిల్లీ: భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి ఇంగ్లాండ్లో (England) దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను తన రూమ్కు తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేయగా.. న్యాయస్థానం ఏడేళ్ల జైలుశిక్ష విధించినట్లు కార్డిఫ్ పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రీత్ వికల్ అనే 20 ఏళ్ల యువకుడు సౌత్వేల్స్లోని కార్డిఫ్ ప్రాంతంలో ఉంటున్నాడు. గత ఏడాది జూన్ నెలలో అతడు నైట్ క్లబ్కు వెళ్లాడు. అదే సమయంలో ఓ మహిళ కూడా వేరే బృందంతో కలిసి అదే క్లబ్కు వెళ్లింది. ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. క్లబ్లో ఆ మహిళ మద్యం ఎక్కువగా తాగేసింది. ఆ మత్తులో వికల్, ఆ మహిళ ఇద్దరూ.. వాళ్ల గ్రూప్లను వదిలేసి బయటకి వచ్చేశారు. ఆ తర్వాత వికల్ ఆమెను తన రూమ్కి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మహిళను వికల్ క్లబ్ నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అతడిపై వాలిపోయి నడుస్తున్న మహిళను తొలుత తన చేతులపై తీసుకెళ్లిన యువకుడు.. ఆ తర్వాత ఆమెను భుజాలపై ఎత్తుకెళ్లినట్లు సీసీకెమెరాల్లో నమోదైంది. ‘‘ మహిళలపై ఇలాంటి దాడులు జరగడం కార్డిఫ్లో చాలా అరుదు. ప్రీత్ వికల్ లాంటి ప్రమాదకర వ్యక్తుల వల్ల ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ఓ వ్యూహం ప్రకారం మహిళను ఆమె స్నేహితుల నుంచి తప్పించి దారుణానికి ఒడిగట్టాడు’’ అని పోలీసులు వెల్లడించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా అతడికి న్యాయస్థానం తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!