Biden-Jinping: ‘మీ సతీమణి బర్త్డేకు గిఫ్ట్ తీసుకెళ్లు’.. చైనా అధినేత జిన్పింగ్కు గుర్తుచేసిన బైడెన్
Biden-Jinping: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన సతీమణి పుట్టినరోజును మర్చిపోయారట. ఆ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ గుర్తుచేయడంతో జిన్పింగ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
శాన్ ఫ్రాన్సిస్కో: నిత్యం బిజీగా ఉండే దేశాధినేతలు ఒక్కోసారి వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయకతప్పదు. వారు కుటుంబానికి తగిన సమయం కేటాయించలేకపోవచ్చు. చైనా (China) అధినేత షీ జిన్పింగ్ (Xi Jinping) కూడా అలాగే తన సతీమణి పుట్టినరోజును మర్చిపోయారట..! అయితే, ఆమె బర్త్డే గురించి అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) గుర్తుచేయడమే గాక.. ఓ బహుమతి తీసుకెళ్లాలని జిన్పింగ్కు సూచించారు.
అమెరికాలో పర్యటిస్తున్న షీ జిన్పింగ్.. అగ్రరాజ్య అధినేత జో బైడెన్తో ముఖాముఖీగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో దేశాధినేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. నవంబరు 20న బైడెన్ తన 81వ పుట్టినరోజును చేసుకోనున్నారు. అదే రోజున జిన్పింగ్ సతీమణి పెంగ్ లియువాన్ (Peng Liyuan) పుట్టిన రోజు కూడా..!
తాజాగా జరిగిన సమావేశంలో బైడెన్ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ.. పెంగ్కు తన తరఫున శుభాకాంక్షలు తెలపాలని జిన్పింగ్కు చెప్పారు. అయితే, సతీమణి పుట్టినరోజును మర్చిపోయిన జిన్పింగ్ ఆ క్షణంలో ఒకింత ఇబ్బందికి గురయ్యారట. ‘‘ఈ బాధ్యతల్లో పడి నేను ఆ తేదీనే మర్చిపోయా. ఆమె పుట్టిన రోజును గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు. ఆమె కోసం ఏదైనా తీసుకెళ్లేందుకు సీరియస్గా ప్రయత్నిస్తా’’ అని జిన్పింగ్ చెప్పినట్లు యూఎస్ అధికారులు వెల్లడించారు.
‘ఆయన నియంతే..’: జిన్పింగ్తో భేటీ తర్వాత బైడెన్ మళ్లీ అదే మాట..!
అటు సమావేశం తర్వాత బైడెన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘జిన్పింగ్తో నా బంధం చాలా లోతైనది. ప్రపంచంలోని ఇతర నేతలకంటే చైనా అధ్యక్షుడితోనే నేను ఎక్కువ సమయం గడిపా. మా దేశాలకు ఉపాధ్యక్షులుగా ఉన్ననాటి నుంచే మేం సమావేశాల్లో పాల్గొన్నాం. ఆయన కార్యనిర్వహణ శైలి గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆయనకు ఓ బర్త్డే కార్డు (పెంగ్ పుట్టినరోజును ఉద్దేశహస్తూ) కొనాలని గుర్తుచేశా’’ అని బైడెన్ తెలిపారు.
షీ జిన్పింగ్కు తొలుత కె లింగ్లింగ్తో వివాహమైంది. అయితే కొన్ని కారణాలతో వారు 1982లో విడిపోయారు. ఆ తర్వాత
ప్రముఖ జానపద గాయని అయిన పెంగ్ లియువాన్ను 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమార్తె ఉంది. చైనా గత అధ్యక్షుల సతీమణులతో పోలిస్తే.. దేశ ప్రథమ మహిళగా పెంగ్ అనేక సార్లు మీడియాలో కన్పించారు. 2014లో అప్పటి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా బీజింగ్ పర్యటనకు వచ్చినప్పుడు.. ఆమెకు పెంగ్ ప్రత్యేక ఆతిథ్యమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు