ఎయిర్పోర్ట్లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు
అమెరికాలోని ఓ వ్యక్తికి చెందిన లగేజ్ ఎయిర్పోర్ట్లో మాయమైంది. చోరీకి గురైందని గుర్తించిన ప్రయాణికుడు బ్యాగులో ఎయిర్ టాగ్ ఉండటంతో నిందితుడిని ట్రాక్ చేసి తన లగేజ్ను తిరిగి పొందాడు.
వాషింగ్టన్: విమానశ్రయంలో ఒకవేళ లగేజ్ మాయమైతే దానిపై ఫిర్యాదు చేసి సామానును తిరిగి పొందడానికి కొన్నిరోజులు పడుతుంది. లగేజ్ తిరిగి పొందినా అందులో అన్ని వస్తువులు ఉండే అవకాశం లేదు. అయితే ఓ వ్యక్తి తన తెలివితేటలు ప్రదర్శించి గంటల వ్యవధిలోనే ఓ దొంగతనాన్ని ఛేదించాడు. విమానాశ్రయంలో చోరీకి గురైన తన లగేజ్ను తిరిగి పొందాడు. నిందితుడిని పోలీసులకు పట్టించి శభాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బాధితుడి కథనం ప్రకారం..
అమెరికా(United States)కు చెందిన జమీల్ రీడ్ అనే వ్యక్తి లాస్ ఏంజెల్స్ (Los Angeles) నుంచి జార్జియాలోని అట్లాంటా (Atlanta)కు ప్రయాణించడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లాడు. బ్యాగేజ్ కార్సెల్పై చూడగా అతడి బ్యాగ్ కనిపించలేదు. తన బ్యాగు చోరీకి గురైందని గుర్తించాడు. తన బ్యాగులో ఎయిర్టాగ్ ఉండటంతో లగేజ్ను ట్రాక్ చేస్తూ దాని కదలికలను గమనించాడు. నిందితుడు తిరిగి ఎయిర్పోర్టుకు వస్తుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. వారి సమక్షంలో నెల్సన్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాడు. అయితే నెల్సన్ తన దుస్తులే(టీషర్ట్, జీన్స్) ధరించడాన్ని చూసి జమీల్ కంగుతిన్నాడు. ఆ లగేజ్ తనదేనని తొలుత నెల్సన్ పోలీసుల ముందు బుకాయించిన అతడు జమీల్ దుస్తులు ధరించడంతో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగులో సుమారు 3,000 డాలర్ల(రూ. 2.4 లక్షలు) విలువైన వస్తువులున్నాయని బాధితుడు తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్