Pakistan: అమెరికాతో దోస్తీ నష్టమే.. పాక్ మంత్రుల సంభాషణ లీక్..!
పాక్ ప్రధాని, విదేశాంగశాఖ జూనియర్ మంత్రికి మధ్య జరిగిన కీలక సంభాషణలు అమెరికా చేతిలో ఉన్నాయి. ఆ విషయాన్ని వాషింగ్టన్ పోస్టు పత్రిక నిన్న కథనంలో పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA) నిఘా నేత్రం పాకిస్థాన్(Pakistan)పై ఏ స్థాయిలో ఉందో తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్( Shehbaz Sharif), విదేశాంగశాఖ జూనియర్ మంత్రి హీనా రబ్బానీ (Hina Rabbani )మధ్య జరిగిన సంభాషణలను అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించాయి. దీనికి సంబంధించిన పత్రాలు.. డిస్కార్డ్ మెసేజింగ్ యాప్లో బహిర్గతం అయ్యాయి. ఈ పత్రాల వివరాలను ఆదివారం వాషింగ్టన్ పోస్టు పత్రిక ప్రచురించింది.
పశ్చిమ దేశాలను సంతృప్తి పర్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడాన్ని మానుకోవాలని ప్రధానికి హీనా రబ్బానీ సూచించినట్లు ఆ పత్రంలో ఉంది. చైనా, అమెరికా విషయంలో మధ్యస్తంగా ఉండేందుకు భవిష్యత్తులో ప్రయత్నాలు చేయలేమని ఆ సమయంలో అభిప్రాయపడ్డారు. గతంలో పాక్-అమెరికాల మధ్య మిత్రత్వం కారణంగా చైనాతో వ్యూహాత్మక బంధంతో లభించే ప్రయోజనాలను త్యాగం చేయాల్సి వచ్చిందని హీనా దానిలో వాదించారు. ఎలాంటి తేదీని పేర్కొనకుండా ఉన్న ఈ పత్రాలు అమెరికా చేతికి ఎలా వచ్చాయో తెలియడం లేదు.
ఫిబ్రవరి 17వ తేదీతో ఉన్న మరో పత్రంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఐరాసలో పాక్ విధానంపై తన వద్ద పనిచేసే అధికారికి చేసిన సూచనలున్నాయి. ఆ తర్వాత ఐరాసలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్పై జరిగిన ఓటింగ్కు దూరంగా ఉన్న 32 దేశాల్లో పాక్ కూడా ఒకటి. ఇటీవలే పాక్-రష్యా మధ్య చమురుపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ పత్రాల లీక్పై వాషింగ్టన్ పోస్టులో కథనం ప్రచురితం కావడం గమనార్హం.
2010లో వికీలీక్స్ తర్వాత అమెరికాలో జరిగిన అతిపెద్ద లీక్గా ఇటీవల డిస్కార్డ్ యాప్లో దర్శనమిచ్చిన పత్రాలు నిలిచాయి. అమెరికా రహస్య పత్రాలు తొలిసారి మార్చి 1వ తేదీన ‘డిస్కార్డ్’ అనే సోషల్ మీడియా వేదికపై కనిపించాయి. ఆ తర్వాత వీటి సంఖ్య మరింత పెరిగింది. డిస్కార్డ్ను ఎక్కువగా వీడియో గేమర్లు చాట్ రూమ్ల కోసం వినియోగిస్తుంటారు. మైన్క్రాఫ్ట్ గేమ్, ఉక్రెయిన్ యుద్ధంపై చిన్న వాదన జరిగిన సమయంలో ఓ యూజర్ ఇక్కడ కొన్ని లీకైన పత్రాలున్నాయి అని పేర్కొని.. పెద్ద సంఖ్యలో స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. లీక్ చేసిన వ్యక్తిని అమెరికా ఎయిర్ నేషనల్ గార్డ్ జాక్ టెయిక్సిరా అనే యువకుడిగా గుర్తించి అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!