Afghanistan: అఫ్గాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో ప్రయాణికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు.

Published : 17 Mar 2024 14:16 IST

కాందహార్: అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది మరణించగా.. 38 మంది గాయపడ్డారు. ఆదివారం హెల్మాండ్‌ ప్రావిన్స్‌లోని గెరాష్క్‌ జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక ట్రాఫిక్‌ నియంత్రణ అధికారి క్వద్రాతుల్లా తెలిపారు. కాందహార్‌ నుంచి హెరత్‌ ప్రావిన్స్‌కు వెళుతున్న బస్సును బైక్‌ ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌పైకి దూసుకెళ్లింది. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని