Afghanistan: అఫ్గాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
అఫ్గానిస్థాన్లో ప్రయాణికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు.
కాందహార్: అఫ్గానిస్థాన్ (Afghanistan)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది మరణించగా.. 38 మంది గాయపడ్డారు. ఆదివారం హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక ట్రాఫిక్ నియంత్రణ అధికారి క్వద్రాతుల్లా తెలిపారు. కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్కు వెళుతున్న బస్సును బైక్ ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఆయిల్ ట్యాంకర్పైకి దూసుకెళ్లింది. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్