దేశం వీడుతున్న శరణార్థుల్నీ వదలని పాక్.. వారిపై ఎగ్జిట్ ఛార్జీలు
అఫ్గానిస్థాన్(Afghanistan) శరణార్థుల పట్ల పాకిస్థాన్ వ్యవహరిస్తోన్న తీరు విమర్శలకు దారితీస్తోంది. దాయాది దేశం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి.
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్(Pakistan) కొత్త ఆదాయమార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పాక్ను వీడుతున్న అఫ్గానిస్థాన్ శరణార్థుల(Afghan Refugees) నుంచి ఎగ్జిట్ ఛార్జీల(Exit Fee)ను వసూలు చేయాలని నిర్ణయం తీసుకుందని మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. పాశ్చాత్య దేశాలు, ఐరాస పాక్ చర్యలను ఖండించాయి.
2021లో అఫ్గానిస్థాన్(Afghanistan)లో పౌర ప్రభుత్వాన్ని కూలదోసి, తాలిబన్లు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. వారి మునుపటి ఆరాచక పాలనలో అనుభవించిన కష్టాలతో బెంబేలెత్తిన అఫ్గాన్ వాసులు పొట్ట చేతపట్టుకొని పలు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లారు. 2023 వరకు 64.3 లక్షల మంది శరణార్థులుండగా.. వారిలో 34.3 లక్షల మంది ఇరాన్ను ఆశ్రయం కోరారు. 21.3 లక్షల మంది పాకిస్థాన్కు వెళ్లారు.
అఫ్గానీయుల ఇంటి బాట.. 4 లక్షలమంది వెనక్కి!
అయితే పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోన్న నేపథ్యంలో.. సరైన అనుమతులు లేకుండా పాకిస్థాన్ (Pakistan)లో నివసిస్తోన్న అఫ్గానీయులను వారి స్వదేశానికి పంపించేస్తున్న విషయం తెలిసిందే. నవంబరు 1వ తేదీ నాటికే దేశం విడిచిపోవాలని ఆదేశించిన పాక్ అధికారులు.. ఇంకా ఇక్కడే ఉన్నవారిపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం గడువు ముగిసిన నేపథ్యంలో.. స్థానిక పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపడుతున్నారు. ఇంకా ఇక్కడే అక్రమంగా నివసిస్తోన్నవారిని ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో పాక్ అనూహ్య చర్యలు ప్రారంభించింది. పునరావాస పథకాల ద్వారా పాశ్చాత్య దేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారు పాక్ను వీడేందుకు 830 డాలర్లు( సుమారుగా రూ.69వేలు) చెల్లించేలా విధానాన్ని తీసుకువచ్చింది. ఒక్కో వ్యక్తి ఈ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. మొదట అసలు ఆ మొత్తాన్ని 10 వేల డాలర్లు అనుకున్నారట. అయితే తర్వాత దానికి 830 డాల్లకు తగ్గించారట. అయితే ఈ చర్యను పలు దేశాలు ఖండిస్తున్నాయి. పాక్ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. శరణార్థుల నుంచి డబ్బు వసూలు చేయడం ఎబ్బెట్టుగా ఉందని వ్యాఖ్యానించాయి. అయితే ఈ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం ఏదీ లేదని పాక్ విదేశాంగ వెల్లడించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు