Pakistan: అఫ్గానీయుల ఇంటి బాట.. 4 లక్షలమంది వెనక్కి!
ఇప్పటివరకు మొత్తం నాలుగు లక్షలకుపైగా అఫ్గాన్వాసులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు పాకిస్థాన్ తెలిపింది.
ఇస్లామాబాద్: సరైన అనుమతులు లేకుండా పాకిస్థాన్ (Pakistan)లో నివసిస్తోన్న అఫ్గానీయులను వారి స్వదేశానికి పంపించేస్తున్న విషయం తెలిసిందే. నవంబరు 1వ తేదీ నాటికే దేశం విడిచిపోవాలని ఆదేశించిన పాక్ అధికారులు.. ఇంకా ఇక్కడే ఉన్నవారిపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం నాలుగు లక్షలకుపైగా అఫ్గాన్వాసులు (Afghans) తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు తాజాగా వెల్లడించారు. తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ సంఖ్యను ధ్రువీకరించారు. చాలా మంది టోర్ఖం, స్పిన్ బోల్డాక్ సరిహద్దుల గుండా తమ దేశానికి తిరిగి వచ్చేస్తున్నట్లు ఓ వార్తాసంస్థతో తెలిపారు. వారికి ఆశ్రయం, ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు.
మా దేశం విడిచి వెళ్లిపోండి.. అఫ్గాన్ వాసులకు పాకిస్థాన్ హుకుం
1980ల్లో సోవియట్ యూనియన్ ఆక్రమణ సమయంలో లక్షలాది మంది అఫ్గాన్వాసులు శరణు కోరుతూ పాకిస్థాన్లోకి ప్రవేశించారు. 2021లో తాలిబన్లు అఫ్గాన్ను తిరిగి అక్రమించుకున్న తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. అయితే.. వారిలో దాదాపు 17 లక్షల మంది ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లు పాక్ ఆరోపించింది. సరైన పత్రాలు లేనివారంతా నవంబర్ 1వ తేదీ లోపు దేశం విడిచి పోవాలని ఆదేశించింది. ఇది హక్కుల ఉల్లంఘనే అని ఐరాస నుంచి ఆందోళన వ్యక్తమైనప్పటికీ.. ఈ నిర్ణయంపై ముందుకెళ్లింది. ప్రస్తుతం గడువు ముగిసిన నేపథ్యంలో.. స్థానిక పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపడుతున్నారు. ఇంకా ఇక్కడే అక్రమంగా నివసిస్తోన్నవారిని ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నారు.
వీసా ఉంటేనే ప్రవేశం కల్పించేలా..!
పాకిస్థాన్ సరిహద్దులోని చమన్ నగరం నుంచి అఫ్గాన్లోకి ప్రవేశించేందుకు వీలుగా ఇదివరకు స్థానికులకు ప్రత్యేక అనుమతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీసాలు అవసరమయ్యేలా పాకిస్థాన్ అధికారులు ప్రణాళిక ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయాన్ని వేలాది మంది స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇరు ప్రాంతాలను కలిపే కీలక రహదారిపై సోమవారం రాకపోకలను అడ్డుకున్నారు. వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక అనుమతులను కొనసాగించాలని, పొరుగునే అఫ్గాన్లోని స్పిన్ బోల్డాక్లో నివసించే తమ బంధువులను కలవడానికి అనుమతించాలని కోరుతూ వారు నిరసనలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్
గాజాపై దాడులను విస్తరిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. తమ భూభాగంపై ఎవరు దాడి చేసినా దానికి తీవ్ర ప్రతిదాడి చేస్తామని, అదే తమ విధానమని ఐడీఎఫ్ ప్రతినిధులు వెల్లడించారు. -
జబాలియాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జబాలియా శరణార్థి శిబిరంపై ఆదివారం మరోసారి బాంబుల వర్షం కురిపించింది. -
మ్యూనిక్ ఎయిర్పోర్టులో మంచుతుపాను
నిత్యం రద్దీగా ఉండే జర్మనీలోని మ్యూనిక్ విమానాశ్రయం మంచులో కూరుకుపోయింది. భారీ మంచుతుపాను కారణంగా 760 విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
యుద్ధం తర్వాత గాజా భవిష్యత్తేంటి..?
హమాస్తో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత గాజా భవిష్యత్తు ఏమిటి..? అన్న విషయంపై ఇజ్రాయెల్ కసరత్తు చేస్తోంది. -
ఫిలిప్పీన్స్లో మళ్లీ భూకంపం
దక్షిణ ఫిలిప్పీన్స్ను ఆదివారం కూడా భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై 6.6గా తీవ్రతతో భూకంపం నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. -
కాప్-28 ఆరోగ్య డిక్లరేషన్పై సంతకం చేయని భారత్
ఆరోగ్యం, వాతావరణంపై కాప్-28 రూపొందించిన డిక్లరేషన్పై భారత్ సంతకం చేయలేదు. ఆరోగ్యరంగంలో శీతలీకరణకు వినియోగించే గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించాలని ఈ డిక్లరేషన్ చెబుతోంది. -
ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధనౌకపై దాడి
ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో అతలాకుతలమవుతున్న పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. -
Tanzania: టాంజానియాలో విరిగిపడ్డ కొండచరియలు.. 47 మంది మృతి
టాంజానియాలో గతకొంతకాలంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి చెందారు. మరో 85 మంది గాయపడ్డారు.


తాజా వార్తలు (Latest News)
-
Assembly Election Results: ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?
-
Mizoram Election Results: మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్.. ఆధిక్యంలో ప్రతిపక్ష పార్టీ
-
Upcoming Telugu Movies: ఈవారం థియేటర్/ఓటీటీల్లో.. అలరించే సినిమాలు, సిరీస్లివే
-
తూప్రాన్లో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరి మృతి?
-
Cyclone Michaung: తుపాను.. గంటకు 14కి.మీ వేగంతో ముందుకు..
-
Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్.. 20,500 పైకి నిఫ్టీ