Pakistan: అఫ్గానీయుల ఇంటి బాట.. 4 లక్షలమంది వెనక్కి!
ఇప్పటివరకు మొత్తం నాలుగు లక్షలకుపైగా అఫ్గాన్వాసులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు పాకిస్థాన్ తెలిపింది.
ఇస్లామాబాద్: సరైన అనుమతులు లేకుండా పాకిస్థాన్ (Pakistan)లో నివసిస్తోన్న అఫ్గానీయులను వారి స్వదేశానికి పంపించేస్తున్న విషయం తెలిసిందే. నవంబరు 1వ తేదీ నాటికే దేశం విడిచిపోవాలని ఆదేశించిన పాక్ అధికారులు.. ఇంకా ఇక్కడే ఉన్నవారిపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం నాలుగు లక్షలకుపైగా అఫ్గాన్వాసులు (Afghans) తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు తాజాగా వెల్లడించారు. తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ సంఖ్యను ధ్రువీకరించారు. చాలా మంది టోర్ఖం, స్పిన్ బోల్డాక్ సరిహద్దుల గుండా తమ దేశానికి తిరిగి వచ్చేస్తున్నట్లు ఓ వార్తాసంస్థతో తెలిపారు. వారికి ఆశ్రయం, ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు.
మా దేశం విడిచి వెళ్లిపోండి.. అఫ్గాన్ వాసులకు పాకిస్థాన్ హుకుం
1980ల్లో సోవియట్ యూనియన్ ఆక్రమణ సమయంలో లక్షలాది మంది అఫ్గాన్వాసులు శరణు కోరుతూ పాకిస్థాన్లోకి ప్రవేశించారు. 2021లో తాలిబన్లు అఫ్గాన్ను తిరిగి అక్రమించుకున్న తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. అయితే.. వారిలో దాదాపు 17 లక్షల మంది ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లు పాక్ ఆరోపించింది. సరైన పత్రాలు లేనివారంతా నవంబర్ 1వ తేదీ లోపు దేశం విడిచి పోవాలని ఆదేశించింది. ఇది హక్కుల ఉల్లంఘనే అని ఐరాస నుంచి ఆందోళన వ్యక్తమైనప్పటికీ.. ఈ నిర్ణయంపై ముందుకెళ్లింది. ప్రస్తుతం గడువు ముగిసిన నేపథ్యంలో.. స్థానిక పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపడుతున్నారు. ఇంకా ఇక్కడే అక్రమంగా నివసిస్తోన్నవారిని ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నారు.
వీసా ఉంటేనే ప్రవేశం కల్పించేలా..!
పాకిస్థాన్ సరిహద్దులోని చమన్ నగరం నుంచి అఫ్గాన్లోకి ప్రవేశించేందుకు వీలుగా ఇదివరకు స్థానికులకు ప్రత్యేక అనుమతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీసాలు అవసరమయ్యేలా పాకిస్థాన్ అధికారులు ప్రణాళిక ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయాన్ని వేలాది మంది స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇరు ప్రాంతాలను కలిపే కీలక రహదారిపై సోమవారం రాకపోకలను అడ్డుకున్నారు. వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక అనుమతులను కొనసాగించాలని, పొరుగునే అఫ్గాన్లోని స్పిన్ బోల్డాక్లో నివసించే తమ బంధువులను కలవడానికి అనుమతించాలని కోరుతూ వారు నిరసనలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!