Sri Lanka Crisis: రుణాలు చెల్లించలేం.. విదేశీ రుణాలను ‘డీఫాల్ట్’గా ప్రకటించిన శ్రీలంక
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలతోపాటు ఇతర రుణదాతలు ఇచ్చిన రుణాలను ప్రస్తుత సమయంలో తిరిగి చెల్లించలేమని చేతులు ఎత్తేసింది.
సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చివరి ప్రయత్నమన్న ప్రభుత్వం
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలతోపాటు ఇతర రుణదాతలు ఇచ్చిన రుణాలను ప్రస్తుత సమయంలో తిరిగి చెల్లించలేమని చేతులు ఎత్తేసింది. విదేశీ రుణాలను డీఫాల్ట్గా ప్రకటించిన శ్రీలంక.. మొత్తం 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని పేర్కొంది. విదేశీ మారకనిల్వలు అడుగంటిన నేపథ్యంలో.. అత్యవసర వస్తువుల దిగుమతికి ఈ చర్యలు ‘చివరి ప్రయత్నం’గా పేర్కొంది. తీవ్ర ఆర్థిక, ఆహార, ఇంధన కొరతతో అల్లాడుతోన్న శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు తాజా చర్యలు చేపట్టామని తెలిపింది.
తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక విదేశీ రుణ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అక్కడి సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ‘రుణాల చెల్లింపులు సవాళ్లతో కూడుకున్నదే కాకుండా అసాధ్యం అనే స్థితికి చేరిపోయం. రుణాలను పునర్నిర్మించడంతోపాటు పూర్తి డీఫాల్ట్ను నివారించడమే ప్రస్తుతం తీసుకోగలిగిన ఉత్తమ చర్య’ అని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పీ నందాలాల్ వీరసింఘే పేర్కొన్నారు. చిత్తశుద్ధితోనే ఈ చర్యలు తీసుకున్నామన్న ఆయన.. 2.2కోట్ల జనాభా కలిగిన శ్రీలంక గతంలో రుణ చెల్లింపులను ఎన్నడూ ఎగవేయలేదని ఉద్ఘాటించారు.
ఇదిలాఉంటే, ‘కొవిడ్ లాక్డౌన్’ కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించాయని శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందన్న ఆయన.. ప్రజలు ఆందోళనలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతూ పరిస్థితులు దారుణంగా మారాయని.. రానున్న రోజుల్లో నిత్యవసర వస్తువులతోపాటు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో పరిస్థితులు మరింత క్షీణించనున్నాయని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు