Donald Trump: కేసుల సుడిగుండంలో ట్రంప్.. మరోసారి నేరాభియోగాలు..!
ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై నేరాభియోగాలు నమోదయ్యాయి. దీంతో ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారు.
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగబోయే అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కేసుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనపై నేరాభియోగాలు (Trump Indicted) నమోదవ్వగా.. తాజాగా మరో కేసులోనూ ఎదురుదెబ్బ తగిలింది. 2020 నాటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు చేసిన ప్రయత్నానికి గానూ ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసులో ట్రంప్ (Donald Trump)పై దర్యాప్తు చేపట్టాలని వాషింగ్టన్ స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ మంగళవారం ఆదేశించారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అవాస్తవ ఆరోపణల ఆధారంగా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు అధికారులు న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో మాజీ అధ్యక్షుడిపై నేరాభియోగాలు నమోదయ్యాయి. గురువారం ఆయన న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది.
హిందీలో మాట్లాడితే ఉద్యోగం పోయింది!
2021 జనవరి 6న ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించిన ప్రసంగించిన కొద్ది గంటలకే అమెరికా క్యాపిటల్ భవనంపై భీకర దాడి జరిగిన విషయం తెలిసిందే. బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సమావేశమైన వేళ.. వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు భవనంలోకి దూసుకెళ్లారు. ఆ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, తాజా నేరాభియోగాలను ట్రంప్ తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే డెమోక్రాట్లు తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు.
2024 అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ముందంజలో ఉన్న ట్రంప్పై ఇలా వరుసగా కేసులు నమోదవ్వడం గమనార్హం. ఇప్పటికే ఓ శృంగార తారకు డబ్బుల చెల్లింపు కేసులో, శ్వేతసౌధం రహస్య పత్రాలను తరలించిన కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇక, జార్జియాలోనూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై స్థానిక న్యాయస్థానంలో కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ