Indo-American Engineer: హిందీలో మాట్లాడితే ఉద్యోగం పోయింది!
భారతదేశంలో అవసాన దశలో ఉన్న తన బావతో హిందీభాషలో వీడియోకాల్ మాట్లాడినందుకు 78 ఏళ్ల భారతీయ అమెరికన్ ఇంజినీర్ అనిల్ వర్ష్ణే ఉద్యోగం ఊడిపోయింది.
కోర్టుకెక్కిన ఇండో అమెరికన్ ఇంజినీర్
వాషింగ్టన్: భారతదేశంలో అవసాన దశలో ఉన్న తన బావతో హిందీభాషలో వీడియోకాల్ మాట్లాడినందుకు 78 ఏళ్ల భారతీయ అమెరికన్ ఇంజినీర్ అనిల్ వర్ష్ణే ఉద్యోగం ఊడిపోయింది. ఈయన అమెరికా రక్షణ రహస్యాలను బయటకు చేరవేస్తున్నాడని హిందీభాష తెలియని శ్వేతజాతి సహోద్యోగి ఫిర్యాదు చేయడంతో అనిల్కు ఉద్వాసన తప్పలేదు. ఈ జాతివివక్ష వల్ల తాను గత అక్టోబరు నుంచి నిరుద్యోగిగా ఉన్నానని, జరిగిన అన్యాయానికి తాను పనిచేస్తున్న సంస్థ ‘పార్సన్స్ కార్పొరేషన్’ నష్టపరిహారం చెల్లించాలంటూ ఆయన కోర్టుకెక్కారు. 1968లో అమెరికాకు వలసవెళ్లిన అనిల్ దంపతులు ఆ దేశ పౌరసత్వం కూడా తీసుకున్నారు. ఆయన భార్య 1989 నుంచి నాసాలో ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అనిల్ హంట్స్విల్లోని పార్సన్స్ కార్పొరేషనులో సిస్టమ్స్ ఇంజినీర్. అమెరికా ప్రభుత్వ క్షిపణి రక్షణ సంస్థ (ఎండీఏ)కు ఇది గగనతల రక్షణ సేవలు అందించే సంస్థ. భూతలంపై క్షిపణి నిరోధక వ్యవస్థను రూపొందించి ఎండీఏకి 50 లక్షల డాలర్లు ఆదా చేసినందుకు అనిల్కు గతంలో మేటి ఉద్యోగి అవార్డు కూడా లభించింది. భారత్లో ఉంటున్న అనిల్ బావ కె.సి.గుప్తా అవసానదశలో ఉండగా.. గతేడాది సెప్టెంబరు 26న అనిల్కు వీడియోకాల్ చేశారు. దాదాపుగా తుదిపలుకులు మాట్లాడేందుకే ఆయన కాల్ చేశారు.
బావతో మళ్లీ మాట్లాడే అవకాశం లభించకపోవచ్చని అనిల్ ఒక ఖాళీ గదిలోకి వెళ్లి హిందీలో మాట్లాడసాగారు. ఈ సంభాషణ రెండు నిమిషాలపాటు నడిచింది. ఇంతలో ఒక సహోద్యోగి వచ్చి వీడియోకాల్ మాట్లాడకూడదని ఆయనతో అన్నారు. దీంతో అనిల్ వెంటనే ఫోన్ ఆఫ్ చేశారు. హిందీభాష తెలియని సహోద్యోగి ఆయన రహస్య సమాచారాన్ని బయటకు తరలిస్తున్నాడని అనుమానించాడు. వీడియోకాల్స్ను కంపెనీ నిషేధించకపోయినా, అనిల్ భద్రతా నియమాలను ఉల్లంఘించారంటూ ఆ కంపెనీ ఆయనకు ఉద్వాసన పలికింది. అంతేకాదు, ఎండీఏ కార్యక్రమాల్లో ఎన్నటికీ పాల్గొనకూడదని నిషేధించింది. అనిల్ను గూఢచారిగా అనుమానించింది. ఎండీఏ అధికారులు ఆయన ఫైళ్లను, ఇతర సామగ్రినీ క్షుణ్నంగా శోధించినా నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలి లేదా నష్టపరిహారం చెల్లించాలని అనిల్ కోర్టుకెక్కారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక డాలరు పెట్టి కొన్న పాత పేపర్లలో.. అన్నీ సైనిక రహస్యాలే!
ఒక డాలరు కంటే తక్కువతో కొనుగోలు చేసిన కొన్ని పాత పేపర్లలో ఆ దేశ సైనిక రహస్యాలు ఉన్నట్లు వెల్లడైంది. -
మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు.. కువైట్ అగ్నిప్రమాదంలో భయానక దృశ్యాలు
కువైట్ అగ్నిప్రమాద ఘటన (Kuwait fire tragedy)లో పలు విషాదకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన పలువురు కార్మికులు బయటకు వచ్చే క్రమంలో మెట్లపైనే ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా వెల్లడించింది. -
బరువు పెరిగితే బుర్ర తగ్గుతుంది!
ఊబకాయం కారణంగా చిన్నారుల్లో మేధో సామర్థ్యం (ఐక్యూ) తగ్గే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
మంగోలియాను పీడిస్తున్న జడ్
ప్రకృతి వైపరీత్యమైన జడ్ కారణంగా మంగోలియా సతమతమవుతోంది. తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని మంగోలియాలో జడ్ అంటారు. -
క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 9 మంది మృత్యువాతపడ్డారు. -
కువైట్లో భారీ అగ్నిప్రమాదం.. 49 మంది దుర్మరణం
ఎడారి దేశం కువైట్లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
ఉద్యోగినులతో ‘మస్క్’ లైంగిక సంబంధం
టెస్లా అధినేత ఎలాన్ మస్క్పై మరోసారి సంచలన కథనం ప్రచురితమైంది. తన సంస్థ స్పేస్ఎక్స్లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. -
నోబెల్ గ్రహీత యూనస్పై బంగ్లాలో అభియోగం దాఖలు
నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ (83), మరో 13 మంది కలిసి ఒక టెలికం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి 20 లక్షల డాలర్లకు పైగా స్వాహా చేశారని ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం అభియోగం దాఖలైంది. -
ఉత్తర ఇజ్రాయెల్పై 215 రాకెట్లు
ఇజ్రాయెల్పై హెజ్బొల్లా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మంగళవారం రాత్రి హెజ్బొల్లా సీనియర్ కమాండర్ తలెబ్ అబ్దుల్లా(55)ను దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి హతమార్చింది. -
ఇటలీలో మహాత్ముడి విగ్రహంధ్వంసం చేసిన ‘ఖలిస్థానీలు’
ఖలిస్థాన్ ఉద్యమ సానుభూతిపరులు ఇటలీలో బుధవారం మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం నుంచి ఇక్కడ జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో భారతీయుడి మృత్యువాత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో భారతీయుడు మృత్యువాతపడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కాల్పుల విరమణపై కుదరని ఏకాభిప్రాయం
కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. -
కాంగోలో పడవ మునిగి 86 మంది మృతి
కాంగో రాజధాని నగరమైన కిన్షాసా సమీపంలోని క్వా నదిలో 271 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగి, 86 మంది మృతిచెందారు. -
కెనడాతో అదే సమస్య - జీ7 సదస్సు వేళ భారత్ ఆందోళన
తీవ్రవాదం, హింసను సమర్థించే భారత్ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పించడమే కెనడాతో ఉన్న ప్రధాన సమస్య అని భారత విదేశాంగ పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
‘మహారాజ’ నటుడి అనుమానాస్పద మృతి.. ఇంట్లోనే విగతజీవిగా..
-
భారత్లా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం..? పాక్ నేత వీడియో వైరల్
-
నీట్ వ్యవహారం.. ‘సుప్రీం’ పర్యవేక్షణలో దర్యాప్తు చేయండి: ఖర్గే డిమాండ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఒక డాలరు పెట్టి కొన్న పాత పేపర్లలో.. అన్నీ సైనిక రహస్యాలే!
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. 16,347 పోస్టులు