Trump: కిమ్ ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నారు..: ట్రంప్
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ టచ్లో ఉన్నారని ఓ పుస్తకంలో వెల్లడించింది. ‘ది కాన్ఫిడెన్స్ మ్యాన్’ పేరిట న్యూయార్క్ టైమ్స్
ఇంటర్నెట్డెస్క్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ టచ్లో ఉన్నారని ఓ పుస్తకం వెల్లడించింది. ‘ది కాన్ఫిడెన్స్ మ్యాన్’ పేరిట న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ మాగీ హెబర్మన్ విడుదల చేయనున్న పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించినట్లు హెబర్మన్ పేర్కొన్నారు. వీటిల్లో వాస్తవమెంతో తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ఓ పక్క వరుస క్షిపణి పరీక్షలతో అమెరికా-ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో ఈ అంశం వెలుగులోకి రావడం విశేషం. 2018లో కిమ్-ట్రంప్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి.
ఈ అంశంపై స్పందించేందుకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నిరాకరించింది. మరోవైపు శ్వేత సౌధం కూడా స్పందించలేదు. అక్కడి ‘1799 లోగన్ చట్టం’ ప్రకారం అమెరికా ప్రజలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరపడంపై నిషేధం ఉంది. దీనిపై ఉత్తరకొరియాకు సంబంధించిన ‘ప్రాజెక్టు 38’ డైరెక్టర్ జెన్నీ టౌన్ స్పందించారు. ట్రంప్ ప్రతి విషయాన్ని ఎక్కువగా చెప్పుకొంటారని.. కేవలం గ్రీటింగ్స్ వంటివి ఏమైనా పంపి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, శ్వేత సౌధం అనుమతి లేకుండా అంతకు మించి ఏం జరిగినా.. అమెరికాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వెల్లడించారు.
కిమ్తో సంప్రదింపులు జరిపిన అంశాలకు సంబంధించిన 15 బాక్సుల నిండా రికార్డులను గత నెల అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. ట్రంప్ వీటిని ఫ్లోరిడాలోని తన నివాసంలో ఉంచగా అధకారులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిల్లో చాలా వరకూ అత్యంత రహస్య పత్రాలు కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు