Variant XE: ఒమిక్రాన్ ఉపరకం కంటే 10శాతం ఎక్కువ వ్యాప్తి..!
ఒమిక్రాన్ ఉపరకాల్లో ఉత్పరివర్తనం చెందిన వేరియంట్ (XE రకం)ను గుర్తించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు.
పరిశోధనలు ముమ్మరం చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి అదుపులో ఉన్న వేళ కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్లు మరోసారి కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ ఉపరకాల్లో ఉత్పరివర్తనం చెందిన వేరియంట్ (XE రకం)ను గుర్తించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఒమిక్రాన్లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే దాదాపు 10శాతం ఎక్కువ వ్యాపించే గుణం XE రకానికి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఇటీవల ఇంగ్లాండ్లో వెలుగు చూసిన కొత్తవేరియంట్ XE.. మార్చి 22 నాటికి 637 కేసులు గుర్తించినట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) పేర్కొంది. ఒమిక్రాన్కు చెందిన బీఏ.1, బీఏ.2 రకాల మ్యుటేషన్ల కారణంగా ఏర్పడిన ఈ కొత్తరకం వేరియంట్లపై అధ్యయనం ముమ్మరం చేసిన శాస్త్రవేత్తలు.. రీకాంబినెంట్గా పిలిచే ఇటువంటివి సాధారణంగా త్వరగా చనిపోతాయని చెబుతున్నారు. ఇప్పటివరకు XE వ్యాప్తి, తీవ్రత, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు సరైన ఆధారాలు లేవని యూకేహెచ్ఎస్ఏకు చెందిన ప్రొఫెసర్ సుసాన్ హాప్కిన్స్ పేర్కొన్నారు. అయితే, కొత్త సమాచారం వస్తున్నా కొద్దీ ఈ అంచనాలు స్థిరంగా ఉండవని.. వైరస్ వృద్ధి రేటులో మార్పు ఉండవచ్చని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇంగ్లాండ్లో XE వేరియంట్ సామాజిక వ్యాప్తిలో ఉందనే అనుమానాలను కూడా యూకేహెచ్ఎస్ఏ నిపుణులు వ్యక్తం చేశారు.
తీవ్రత తక్కువేనా..?
ఇప్పటికే XE వేరియంట్ కేసులు థాయిలాండ్, న్యూజిలాండ్లలోనూ వెలుగు చూశాయి. ఈ మ్యుటేషన్ గురించి చెప్పాలంటే మరింత సమాచారం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పేర్కొంది. అయితే, బీఏ.2తో పోలిస్తే ఈ వేరియంట్ వ్యాప్తి 10శాతం ఎక్కువగానే ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని తెలిపింది. అయినప్పటికీ, XE వేరియంట్ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇప్పటివరకు బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ రకాలన్నీ తక్కువ తీవ్రత కలిగినవనే విషయాన్ని గుర్తు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు