Visa: అమెరికాలోనే H-1B వీసా రెన్యువల్.. అందుబాటులోకి పైలట్ ప్రోగ్రామ్
H-1B Visa Renewal: హెచ్-1బీ వీసాదారులు అమెరికాలోనే తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు పైలట్ ప్రోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది.
వాషింగ్టన్: హెచ్-1బీ వీసా (H-1B visa) రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరించేలా అమెరికా (USA) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విదేశీ వృత్తి నిపుణులు తమ హెచ్-1బీ వీసాలను అమెరికాలోనే రెన్యువల్ (Renewal) చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్కు బైడెన్ సర్కారు ఇటీవల పచ్చజెండా ఊపింది. తాజాగా ఇది అందుబాటులోకి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 29 నుంచి ఈ పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభమైనట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇందులోభాగంగా 20వేల వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేయనున్నారు. తొలి దశ ఈ అవకాశాన్ని కేవలం భారతీయులు, కెనడియన్లకు మాత్రమే కల్పించారు. ఐదు వారాల పాటు ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం 4వేలు చొప్పున వీసాలను రెన్యువల్ చేయనున్నారు. 2020 జనవరి 1 నుంచి 2023 ఏప్రిల్ 1 మధ్య మిషన్ కెనడా జారీ చేసిన వీసాలు, 2021 ఫిబ్రవరి 1 నుంచి 2021 సెప్టెంబరు 30 మధ్య మిషన్ ఇండియా జారీ చేసిన వీసాలను మాత్రమే రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పించారు.
14 లక్షల వీసా దరఖాస్తుల పరిష్కారం
అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్-1బీ వీసా (H-1B visa) అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను వినియోగిస్తున్న వారిలో భారతీయులే అధికం. సాధారణంగా వీటి గడువు మూడేళ్లలో తీరిపోతుంది. గతంలో హెచ్-1బీ వీసా కలిగినవారు రెన్యువల్ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. 2004 వరకు ఇదే విధానం అమలయ్యేది.
ఆ తర్వాత దీనిలో మార్పు చేయడంతో.. రెన్యువల్ కోసం స్వదేశం తిరిగిరావడమో లేక మరేదైనా దేశానికి వెళ్లి పునరుద్ధరించుకోవడమో చేయాల్సివస్తోంది. అయితే, గతేడాది జూన్లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చినపుడు హెచ్-1బీ వీసాలను అగ్రరాజ్యంలోనే పునరుద్ధరిస్తామని బైడెన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా పైలట్ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తెచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు