14 లక్షల వీసా దరఖాస్తుల పరిష్కారం
భారత్లోని కాన్సులేట్లద్వారా 2023లో 14 లక్షల మంది భారతీయుల వీసా దరఖాస్తులను పరిష్కరించామని, సందర్శక వీసాల (బీ-1/బీ-2) దరఖాస్తుదారులు వేచి ఉండే సమయాన్ని 75శాతం తగ్గించగలిగామని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
2023లో రికార్డు సృష్టించిన అమెరికా
1,40,000 మంది విద్యార్థులకు వీసా
ప్రతి నాలుగో విదేశీ విద్యార్థీ భారతీయుడే
దిల్లీ: భారత్లోని కాన్సులేట్లద్వారా 2023లో 14 లక్షల మంది భారతీయుల వీసా దరఖాస్తులను పరిష్కరించామని, సందర్శక వీసాల (బీ-1/బీ-2) దరఖాస్తుదారులు వేచి ఉండే సమయాన్ని 75శాతం తగ్గించగలిగామని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీసా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో మెరుగైన పద్ధతులను అవలంభించడం, సిబ్బందిని పెంచడంవల్ల ఇది సాధ్యమైందని తెలిపింది. సందర్శక వీసా దరఖాస్తులకు ప్రస్తుతం వేచి ఉండే సమయాన్ని 1000 రోజుల నుంచి 250 రోజులకు తగ్గించగలిగామని వివరించింది. మిగిలిన వీసా దరఖాస్తుల సమయాన్ని అత్యంత కనిష్ఠ స్థాయికి తీసుకెళ్లగలిగామని పేర్కొంది. 2022తో పోలిస్తే 2023లో దరఖాస్తుదారులు 60శాతం పెరిగారని తెలిపింది.‘ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసే ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులే. అమెరికా చరిత్రలోనే రెండో అత్యధిక బీ-1/బీ-2 వీసా దరఖాస్తులు 2023లో భారత్ నుంచి వచ్చాయి. ఆ ఏడాదిలో 7,00,000కుపైగా దరఖాస్తులను పరిష్కరించాం. తొలి 3 నెలల్లోనే ముంబయిలో సిబ్బందిని పెంచడంద్వారా, ఆధునిక సాంకేతిక పద్ధతులద్వారా ఇది సాధ్యమైంది’ అని అమెరికా రాయబార కార్యాలయం వివరించింది.
విద్యార్థి వీసాల్లో రికార్డు
‘2023లో భారత్లోని అమెరికా కాన్సులేట్లు 1,40,000 మంది విద్యార్థులకు వీసాలను ఇచ్చాయి. ఇది ఏ దేశంతో పోల్చుకున్నా ఎక్కువే. ఇలా అత్యధిక వీసాలను భారతీయ విద్యార్థులకు జారీ చేయడం వరుసగా ఇది మూడో ఏడాది. ముంబయి, దిల్లీ, హైదరాబాద్, చెన్నై ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థి వీసాలను జారీ చేసే కేంద్రాల్లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఫలితంగా అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న 10లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో నాలుగో వంతు భారతీయులే’ అని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు