Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
భారత్ అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నిఘా నౌక ‘యువాన్ వాంగ్-5’కు హంబనటొట ఓడరేవులో ప్రవేశానికి శ్రీలంక తాజాగా మరోసారి అనుమతులు మంజూరు చేసింది. అసలు ఈ నౌకకు తొలుత అనుమతి...
కొలంబో: భారత్ అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నిఘా నౌక ‘యువాన్ వాంగ్-5’కు హంబనటొట ఓడరేవులో ప్రవేశానికి శ్రీలంక తాజాగా మరోసారి అనుమతులు మంజూరు చేసింది. అసలు ఈ నౌకకు తొలుత అనుమతి ఇవ్వడంపైనే భారత్ తీవ్రంగా స్పందించింది. దీంతో వెనక్కి తగ్గిన లంక.. ప్రయాణం వాయిదా వేయాలని డ్రాగన్ను కోరింది. అయితే.. నౌకను ఎందుకు అనుమతించకూడదనే ప్రశ్న చైనానుంచి ఎదురుకాగా.. శ్రీలంక సంతృప్తికర జవాబు ఇవ్వడంలో విఫలమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో తొలుత ఆగస్టు 11న రావాల్సిన నౌక.. ప్రస్తుతం ఆగస్టు 16 నుంచి 22 వరకు హంబన్టొటలో లంగరు వేయనుంది. దీనికి సంబంధించి విదేశాంగ శాఖ క్లియరెన్స్ లభించినట్లు శ్రీలంక హార్బర్ మాస్టర్ నిర్మల్ పీ సిల్వా ఓ వార్తా సంస్థకు తెలిపారు.
శుక్రవారం రాత్రికి ఈ నౌక శ్రీలంకకు ఆగ్నేయంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉందని, హంబన్టొట వైపు నెమ్మదిగా కదులుతోందని ఓడరేవు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ‘యువాన్ వాంగ్-5’.. క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్ చేయగలదు. 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులు దీని నిఘా పరిధిలో వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ నౌక రాకపై అభ్యంతరం తెలుపుతోంది. అయితే, నౌక ప్రయాణాన్ని నిలువరించేందుకు భారత్.. కొలంబోపై ఒత్తిడి తెచ్చిందని చైనా ఇటీవల ఆరోపించింది. భారత ప్రభుత్వం మాత్రం వాటిని తిరస్కరిస్తూ.. సార్వభౌమాధికార దేశంగా శ్రీలంక తన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటుందని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
గాజా జనాభాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐరాస(UN) ఆందోళన వ్యక్తం చేసింది. -
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమని చైనాకు విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది. -
Flight Journey: ‘లావుగా ఉన్నామని విమానం నుంచి దించేశారు’
లావుగా ఉన్నారనే నెపంతో ఇద్దరు మహిళలను విమానం నుంచి దించేసిన దారుణ ఘటన ఎయిర్ న్యూజిలాండ్లో (New Zealand) చోటుచేసుకుంది. -
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్