Allu Arjun: ‘ఆర్య’.. నా కెరీర్‌ని ట్రాక్‌లోకి తీసుకొచ్చింది: అల్లుఅర్జున్‌

తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు అని ప్రముఖ నటుడు అల్లుఅర్జున్‌ (Allu Arjun) అన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది.

Published : 08 May 2024 15:29 IST

తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు అని ప్రముఖ నటుడు అల్లుఅర్జున్‌ (Allu Arjun) అన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘నా జీవితాన్ని మార్చేసిన చిత్రం ఆర్య. నా జీవితాన్ని ప్రభావితం చేసిన దర్శకుడు సుకుమార్‌. ‘ఆర్య’ అనే సినిమా నా కెరీర్‌ని ట్రాక్‌లోకి తీసుకొచ్చింది’’ అన్నారు.

Tags :

మరిన్ని