Mallareddy: గులాబీ దళంలో భగ్గుమన్న విభేదాలు.. మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా భారాస (BRS)లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బోడుప్పల్‌లో జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో.. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి మాట్లాడుతుండగా, మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఆవేశానికి గురయ్యారు. జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డిని సమ్మేళనానికి ఎందుకు ఆహ్వానించలేదని, ఉద్యమ సమయంలో పని చేసిన కార్యకర్తలనూ మంత్రి పట్టించుకోవడంలేదని సుధీర్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన మల్లారెడ్డి.. చేతిలోని మైక్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సర్దిచెప్పారు.

Updated : 16 Apr 2023 20:37 IST

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా భారాస (BRS)లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బోడుప్పల్‌లో జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో.. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి మాట్లాడుతుండగా, మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఆవేశానికి గురయ్యారు. జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డిని సమ్మేళనానికి ఎందుకు ఆహ్వానించలేదని, ఉద్యమ సమయంలో పని చేసిన కార్యకర్తలనూ మంత్రి పట్టించుకోవడంలేదని సుధీర్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన మల్లారెడ్డి.. చేతిలోని మైక్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సర్దిచెప్పారు.

Tags :

మరిన్ని