Viral Video: వాగులో బస్సు బోల్తా.. 50 మందికి తృటిలో తప్పిన ప్రమాదం

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో బస్సు బోల్తా పడగా.. దాదాపు 50 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ష్యోపుర్ జిల్లాలో జరిగింది. కొద్ది రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో జిల్లాలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బస్సు డ్రైవర్.. ఊంపచాలోని వాగును దాటేందుకు యత్నించాడు. అనూహ్యంగా బస్సు పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు.

Published : 09 Oct 2022 15:58 IST

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో బస్సు బోల్తా పడగా.. దాదాపు 50 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ష్యోపుర్ జిల్లాలో జరిగింది. కొద్ది రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో జిల్లాలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బస్సు డ్రైవర్.. ఊంపచాలోని వాగును దాటేందుకు యత్నించాడు. అనూహ్యంగా బస్సు పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు.

Tags :

మరిన్ని