AP News: పిచ్చిపిచ్చి బ్రాండ్లతో ప్రజారోగ్యాన్ని పీల్చిపిప్పి చేసిన జగన్‌

రక్తాన్ని జలగ ఎలా తాగుతుందో తెలుసా? స్పర్శ తెలియకుండానే పట్టుకుంటుంది. గ్రహించేలోపే పొట్టనిండా పీల్చేస్తుంది. మద్యనిషేధం అంటూ మాయమాటలు చెప్పిన జగన్ కూడా అంతే! ప్రతిపక్ష నేతగా మద్యాన్ని పేదల రక్తమాంసాలతో పోల్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక అదే మద్యం ఆదాయాన్ని డ్రాకులా కన్నా పైశాచికంగా తాగేస్తున్నారు.

Updated : 26 Apr 2024 14:40 IST

రక్తాన్ని జలగ ఎలా తాగుతుందో తెలుసా? స్పర్శ తెలియకుండానే పట్టుకుంటుంది. గ్రహించేలోపే పొట్టనిండా పీల్చేస్తుంది. మద్యనిషేధం అంటూ మాయమాటలు చెప్పిన జగన్ కూడా అంతే! ప్రతిపక్ష నేతగా మద్యాన్ని పేదల రక్తమాంసాలతో పోల్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక అదే మద్యం ఆదాయాన్ని డ్రాకులా కన్నా పైశాచికంగా తాగేస్తున్నారు. సర్కారీ దుకాణాలు తెరిపించి.. పిచ్చిబ్రాండ్లు తాగించి.. ప్రజారోగ్యాన్ని గుల్లచేస్తున్నారు. లక్షన్నర కోట్లైతే నాసిరకం మద్యంతో మరో లక్షన్నర కోట్ల విలువైన పేదల కష్టార్జితాన్ని కొల్లగొట్టారు. మొత్తంగా.. ఐదేళ్లలో మద్యం రక్కసి వల్ల జనం 3 లక్షల కోట్లు కోల్పోయారు.

Tags :

మరిన్ని