Somu Veerraju: అవినాష్ అనుచరుల దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలి: సోము
వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుల దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. హైదరాబాద్లో మీడియా ప్రతినిధులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. మీడియా ప్రతినిధులకు వైకాపా ప్రభుత్వ పెద్దలు క్షమాపణ చెప్పించాలని కోరారు. వార్తలు రాస్తే దాడులు చేయించటం సమంజసం కాదని.. వైకాపా ప్రభుత్వ అవినీతిపై ఛార్జిషీట్ ధాఖలు చేస్తామని పురందేశ్వరి తెలిపారు.
Updated : 19 May 2023 16:58 IST
Tags :