
ఆంధ్రప్రదేశ్
ఈనాడు, హైదరాబాద్: శ్రీచైతన్య - ఇన్ఫినిటీ లెర్న్ దేశంలోనే అతిపెద్ద స్కాలర్షిప్ పరీక్షకు శ్రీకారం చుట్టినట్లు ప్రకటించింది. కార్యక్రమ డైరెక్టర్ సుష్మ బొప్పన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 18, 19 తేదీల్లో ఆన్లైన్లో, 19 వ తేదీన ఆఫ్లైన్లో నిర్వహించే ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు 3 నుంచి 12వ తరగతుల్లో చేరవచ్చని తెలిపారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల ఫీజు రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. పాల్గొనాలనుకునే వారు ఆన్లైన్లో www.infinitylearn.com/score లో రూ.125 ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఫైనల్ పరీక్ష శ్రీ చైతన్య క్యాంపస్లలో ఆన్లైన్లో జరుగుతుందన్నారు. వివరాల కోసం www.infinitylearn.com/score లేదా 040-71045046 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.