బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 19:36 IST

తాటాకు చప్పుళ్లకు భయపడం: పవన్‌

గణపవరం: వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్‌ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో జూదం, మద్యం, ఇసుక దోపిడీ బాగా అభివృద్ధి చెందాయన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు. ‘‘కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయొద్దంటూ కొన్ని చోట్ల వైకాపా నేతలు బెదిరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని