శుక్రవారం, డిసెంబర్ 13, 2019
తల్లిదండ్రులపై నమ్మకమే బాలలకు పునాది
ఎదిగే వయసుకు తగినట్టుగా జీవన నైపుణ్యాలు
వ్యక్తిగత ఇష్టాలు.. వారిపై రుద్దొద్దు
బోసి నవ్వులను ఆస్వాదిస్తారు.. తప్పటడుగులు సరిచేస్తారు.. చిట్టిపొట్టి మాటలకు మురిసిపోతారు.. బిడ్డల పసితనపు అనుభూతులను తల్లిదండ్రులు ఆనందంగా చవిచూస్తారు. పిల్లలు ఎదిగేకొద్దీ.. కఠినంగా ఉండాలా! స్నేహంగా మెలగాలా! స్వేచ్ఛనివ్వాలా! క్రమశిక్షణతో పెంచాలా! ఇలాంటి ఎన్నో సందేహాల మధ్య సతమతమవుతూనే ఉంటారు. ఈ సందిగ్ధతకు ‘కన్న బిడ్డలతో తల్లిదండ్రులుగా మెలగడమే’ పరిష్కార మార్గమని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు. వారి మనోవికాసానికి అడ్డుగోడగా కాకుండా.. కొత్తగా నాటే మొక్కకు అంటుగా మారి.. పిల్లల మనోవికాసానికి బాసటగా నిలువాలంటున్నారు.
పిల్లలు సాధించే విజయాలకు తల్లిదండ్రుల ప్రశంసలు ఉత్సాహాన్నిస్తాయి. దానికి కొలమానంగా బహుమతులుగా ఇవ్వడాన్ని తగ్గించాలి. తరగతి పెరిగే కొద్దీ బహమానం విలువ వందల నుంచి రూ. వేలు, లక్షలకు చేరుతుంది. మాటలతో మెప్పుకోలు, పొగడ్త, దగ్గరకు తీసుకుని హత్తుకోవడం వంటివి.. ఆయా సందర్భాలకు అనుగుణంగా స్పందించాలి.
బొజ్జలో ఉండగానే బుజ్జగింపులు కాబోయే తల్లిదండ్రుల్లో చాలా మంది.. కడుపులో బిడ్డ మానసిక, శారీరక ఆరోగ్యంగా ఉండాలని యోగాకు సమయం కేటాయిస్తున్నారని శిక్షకురాలు జి.జెస్సీనాయుడు వివరించారు. పిల్లల పెంపకంలో అమ్మానాన్నలిద్దరూ ఒకేతాటిపై ఉండాలనే అంశమూ ఈ శిక్షణలో దాగిఉందన్నారు. ఈ తరం పిల్లల వేగానికి తగినట్టుగానే పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు న్యూరోసైకియాట్రిస్ట్ డాక్టర్ హరీష్చంద్రారెడ్డి. |
అనుకరణే తొలి పాఠం |
గారాబం వద్దు.. క్రమశిక్షణకూ హద్దు |
స్వేచ్ఛనివ్వాలి.. కానీ.. ఆధునికత పేరుతో పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నాం. గంటల కొద్దీ సామాజిక మాధ్యమాల్లో ఉండే అవకాశమిస్తున్నాం. వీటిలో హద్దులు విధించాలి. ఆడుకునేందుకు బయటకు వెళుతున్నామని చెబితే ముందుగానే సమయం నిర్దేశించాలి. స్మార్ట్ఫోన్, అంతర్జాలం, వీడియో గేమ్లు వంటి వాటి విషయంలోనూ అరగంట, గంట వీలును బట్టి ముందే సమయాన్ని సూచించాలి. |
చేటు చేసే మాటలతో భద్రం |
బాక్సింగ్లో కొత్త మెరుపు చిన్నప్పుడు వేలుపట్టి నడిపించిన తండ్రి శిక్షణలోనే బాక్సింగ్లో రాణిస్తూ అలవోకగా బంగారు పతకాలు సాధిస్తున్నాడో బుడతడు. షేక్పేట మారుతీనగర్కు చెందిన ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి పిట్లం ద్వారకేశ్దీ ప్రతిభ. షేక్పేట ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో తండ్రి పి.వినేష్బాబు శిక్షణలోనే అతడు సాధన చేస్తుండటం విశేషం. వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో రాణిస్తూ పోటీల్లో బంగారు పంచ్లు విసిరి జాతీయ పోటీలకు ఎంపికవుతూ వస్తున్నాడు. త్వరలో జరిగే జాతీయ పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ప్రతిరోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల అభ్యాసం చేస్తానని ద్వారకేశ్ తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తీసుకురావడమే లక్ష్యమని చెప్పాడీ బాక్సింగ్ బుల్లోడు. |
వ్యర్థాలపై సాంకేతిక అస్త్రం |
తాజా వార్తలు
జిల్లా వార్తలు