Telangana elections: తెలంగాణలో నేతల ప్రచార ‘సిత్రాలు’
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పలు ఆసక్తికర చిత్రాలను చూసేయండి.
Updated : 07 May 2024 13:38 IST
1/15
మహబూబాబాద్ భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ను గెలిపించాలని కోరుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.
2/15
నకిరేకల్లో కల్లుగీత కార్మికుడిని ఓటు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం.
3/15
సూర్యాపేట పట్టణంలో భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేయాలని వృద్ధురాలిని అభ్యర్థిస్తున్న మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సతీమణి సునీత.
4/15
శంషాబాద్లో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో చేవెళ్ల భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్.
5/15
పికెట్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్, ఎంపీ అభ్యర్థి సునీత, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేశ్.
6/15
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ స్వయంగా ఛాయ్ తయారు చేసి ప్రతి ఒక్కరికీ అందిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
7/15
నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్కు తలపాగా అమర్చుతున్న అన్నామలై.
8/15
మహబూబ్నగర్లోని మైదానంలో ప్రచారం చేస్తున్న భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్.
9/15
జమ్మికుంటలోని ఓ ఫంక్షన్హాల్లో తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలైకి, బండి సంజయ్కి గజమాల వేసిన పార్టీ శ్రేణులు.
10/15
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తరఫున ఆయన సతీమణి డాక్టర్ సంగీతారెడ్డి మహేశ్వరం మండలంలో ప్రచారం చేశారు.
11/15
హైదరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బేగంబజార్లో తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.
12/15
మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ కోడలు క్షమిత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
13/15
సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్, నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డితో కలిసి బంజారాహిల్స్లో ఇంటింటి ప్రచారంలో ప్రజలకు అభివాదం చేశారు.
14/15
మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్లో బీరప్ప కల్యాణోత్సవంలో మా అభ్యర్థి మంచోడు అంటూ మల్కాజిగిరి లోక్సభ భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గడ్డం పట్టుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.
15/15
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బొల్లారంలో ప్రచారం చేశారు. మల్కాజిగిరి లోక్సభ నుంచి పట్నం సునీత, కంటోన్మెంట్ అసెంబ్లీ నుంచి శ్రీగణేశ్ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్