AP News: నాలుగైదు రోజుల్లో 3,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్: బొత్స
ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200 ఉద్యోగాల భర్తీకి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ కీలక అప్డేట్ ఇచ్చారు. 3,200 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. తొలుత టెట్, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నట్టు బొత్స ట్వీట్ చేశారు. యూనివర్సిటీల్లో 18 ఏళ్లుగా శాశ్వత ఉద్యోగాల భర్తీ జరగలేదన్న ఆయన.. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీలలో ఖాళీగా ఉన్న 3,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైజూస్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని బొత్స తెలిపారు. కంటెంట్ మొత్తం బైజూస్ ఉచితంగానే ఇస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆ సంస్థకు చెల్లించట్లేదని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి