Singareni: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది.

Published : 14 Mar 2024 19:43 IST

హైదరాబాద్‌: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిలో ఈఅండ్‌ఎం మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌)లో 42, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సిస్టమ్స్‌)లో 07, జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ ట్రైర్‌ గ్రేడ్‌ సీ - 100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ గ్రేడ్‌ సీ - 24, ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ -1లో 47, సింగరేణిలో ఎలక్ట్రిషియన్‌ ట్రైనీ కేటగిరీ - 98 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 15 నుంచి మే 4వ తేదీ లోపు http://www.scclmines.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సంస్థ సూచించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని