మధుమేహం మందు పేరిట అమెజాన్లో గంజాయి
మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే ఆయుర్వేద ఆకుల పేరుతో గంజాయిని అమెజాన్ ద్వారా తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్నం సెబ్ జేడీ సతీష్కుమార్ మీడియాకు శనివారం తెలిపారు. ఎండు గంజాయిని ‘
అయిదుగురు నిందితుల అరెస్టు
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే ఆయుర్వేద ఆకుల పేరుతో గంజాయిని అమెజాన్ ద్వారా తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్నం సెబ్ జేడీ సతీష్కుమార్ మీడియాకు శనివారం తెలిపారు. ఎండు గంజాయిని ‘సూపర్ నేచురల్ స్టివియా లీవ్స్’ పేరుతో మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే ఆయుర్వేద ఆకులని చెప్పి.. విశాఖ నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్కు అమెజాన్లో పంపుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్లో పట్టుబడిన నిందితులను విచారించగా ఈ విషయం తెలిసింది. అక్కడి సమాచారంతో విశాఖలో సెబ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వారం క్రితం చిలకపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతన్ని విచారించగా కంచరపాలెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పాడు. ఆ ఇంట్లో 48 కేజీల ఎండు గంజాయి, అమెజాన్ ప్యాకింగ్ కవర్లు, తూనిక యంత్రం దొరికాయి. నిందితుడు మధ్యప్రదేశ్కు చెందిన సూరజ్ పవయ, ముకుల్ జైశ్వాల్తో కలిపి గంజాయిని అమెజాన్ ద్వారా పంపిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. 8 నెలలుగా 800 కేజీల గంజాయిని పంపినట్లు పోలీసులు గుర్తించారు. అమెజాన్లో పనిచేస్తున్న ఇద్దరు పికప్ అసోసియేట్లు జీరు కుమారస్వామి, బిజ్జం కృష్ణంరాజు, పికప్ వ్యాన్ డ్రైవర్ చీపురుపల్లి వెంకటేశ్వరరావు, చిలకపాటి శ్రీనివాసరావు కుమారుడు మోహన్రాజును ఇప్పటికే అరెస్టు చేశారు. తనిఖీలు చేయకుండా సరకు రవాణా చేస్తున్నందుకు అమెజాన్ సంస్థకు నోటీసులు జారీచేశారు. ‘పవయ, ముకుల్ జైశ్వాల్ కలిపి అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫాంలో వెండర్గా నమోదు చేసుకున్నారు. శ్రీనివాసరావును కాంటాక్ట్ పాయింట్గా పెట్టుకున్నారు. వారే ఆర్డర్ పెడతారు. అవసరమైన గంజాయిని వారే విశాఖకు వచ్చి ఏజెన్సీ నుంచి తెప్పించుకుని, ప్యాకింగ్ చేయించి పంపిస్తుంటారు’ అని విశాఖపట్నం సెబ్ జేడీ సతీష్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?