ధరలను సవరించాలని కోరడం సరికాదు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) నిబంధనలను, యూనిట్ టారిఫ్(ధర)లను సవరించాలని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, డిస్కంలు...
పీపీఏలు ప్రభుత్వాలతో జరుగుతాయి... రాజకీయ పార్టీలతో కాదు
సౌర, పవన విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాదుల వాదనలు
ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) నిబంధనలను, యూనిట్ టారిఫ్(ధర)లను సవరించాలని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, డిస్కంలు... ఏపీఈఆర్సీని కోరడం సరికాదని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. ఒప్పందాలు ప్రభుత్వాలతో జరుగుతాయేకాని రాజకీయ పార్టీలతో కాదన్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానపరమైన నిర్ణయాలను మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించిన టెండర్ ప్రక్రియ ద్వారా నిర్వహించిన బిడ్డింగ్ తర్వాతే పీపీఏలు జరిగాయని గుర్తుచేశారు. వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. యూనిట్ ధరలను సమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి(ఈఆర్సీ) లేదన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. యూనిట్ ధరలను పునఃసమీక్షించే అధికారం ఈఆర్సీకి ఉందన్నారు. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ యూనిట్ టారిఫ్లను ఏపీ ఈఆర్సీ సమీక్షించేందుకు వీలుకల్పిస్తూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. వ్యాజ్యాలపై హైకోర్టులో సోమవారం తుది విచారణ మొదలైంది. పిటిషనర్ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, పి.శ్రీరఘురాం, బసవ ప్రభుపాటిల్, సజన్ పూవయ్య, చల్లా గుణరంజన్ తదితరులు వాదనలు వినిపించారు. హైకోర్టు సింగిల్ జడ్జి తాత్కాలిక చర్యల్లో భాగంగా బకాయిలను సోలార్ యూనిట్కు రూ.2.44, పవన విద్యుత్ యూనిట్కు రూ.2.43 చొప్పున చెల్లించాలని పేర్కొనడంపై అభ్యంతరం తెలిపారు. ఒకవైపు పీపీఏల విషయంలో ప్రభుత్వ జోక్యం సరికాదంటూనే మరోవైపు తక్కువ ధరలను చెల్లించాలని సింగిల్ జడ్జి పేర్కొనడం సరికాదన్నారు. పీపీఏలో పేర్కొన్న ప్రకారం యూనిట్ ధర రూ.4.84, రూ.4.83 చొప్పున చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పీపీఏలలో ప్రభుత్వ జోక్యాన్ని విద్యుత్ చట్టం నిలువరిస్తుందన్నారు. వినియోగదారులకు విద్యుత్ను సబ్సిడీపై సరఫరా చేసినప్పుడు ఆ సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వాలే డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ శాఖల నుంచి డిస్కంలకు రూ.25 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. తాము ఉత్పత్తి చేసిన విద్యుత్ను పంపిణీ చేస్తున్న డిస్కంలు... వినియోగదారుల నుంచి రుసుములను వసూలు చేస్తూ తమకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నాయని ఆరోపించారు. డిస్కంలు నష్టాల్లో ఉన్నాయనే కారణం చూపుతూ యూనిట్ ధరలను తగ్గించాలని కోరడం సరికాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?