ఉద్యోగుల ఆందోళనకు సీపీఎం మద్దతు

ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆందోళనలకు సీపీఎం మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల అరెస్టులను ఆయన ఖండించారు.

Published : 21 Jan 2022 05:36 IST

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆందోళనలకు సీపీఎం మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల అరెస్టులను ఆయన ఖండించారు. ‘‘ఉద్యోగులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంపై శ్రద్ధ చూపకుండా ఉద్యోగ సంఘాల నాయకులను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌లో పెట్టి వారితోనే ఫోన్లు చేయించి ఉద్యోగులు ఆందోళనకు రావొద్దని బెదిరింపులకు దిగడం అప్రజాస్వామికం’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని