Andhra News: మంత్రి పదవి రాకపోయినా జగన్‌ వెంటే ఉంటా: ఆళ్ల రామకృష్ణా రెడ్డి

మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదు. 2019 ఎన్నికల ప్రచార సభలో ఆళ్లకు మంత్రి పదవి

Updated : 11 Apr 2022 09:42 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదు. 2019 ఎన్నికల ప్రచార సభలో ఆళ్లకు మంత్రి పదవి ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కానీ మొదటి, రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం దక్కలేదు. తాజాగా ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి పదవి రాకపోయినా తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని అన్నారు. నూతన మంత్రివర్గం, ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాననే నమ్మకం తనకు ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని